కియా సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ బ్రాంచ్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జగన్ సర్కార్ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ సంస్థ... ఆంధ్రప్రదేశ్ నుంచి తన బ్రాంచీలు తరలిస్తుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన విపక్ష పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నాయి. ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన కియా సంస్థ జగన్ సర్కారు తీరు వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నాయి. ఇక ఈ విమర్శల పర్వం కాస్త పార్లమెంటు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే కియా సంస్థ ఎక్కడికి వెళ్లడం లేదని అనంతపురంలోనే  కొనసాగుతుంది అంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ వేదికగా టీడీపీ ఎంపీలకు గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

 


 అయితే ఈ అంశం పై స్పందించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు, కియా మోటార్స్ సంస్థ అనంతపురం నుంచి తమిళనాడు తరలి పోతుందని చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారాలు పై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తీవ్ర విమర్శలు చేశారు. ఎంత పెద్ద అబద్ధమైన రాయిస్తారు చంద్రబాబు.. అన్నిటికీ తెగబడి పోయాడు.. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్  ఏజెన్సీ పేరుతో కియా వెళ్ళిపోతుందని అభూత కల్పన సృష్టించాడు చంద్రబాబు నాయుడు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ము లేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడు అంటూ చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి. 

 


 ఈ సందర్భంగా మరో ట్వీట్ చేసిన విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగాళాఖాతం తీరం నుంచి దూరంగా జరిగి పోతుంది. నదులన్నీ వెనక్కి ప్రవహిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటు వైపు వస్తుంది. ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం ధూసుకొస్తున్నట్లు నాసా హెచ్చరించింది ఇలాంటి వార్తలు కూడా వస్తాయి త్వరలో అంటూ చంద్రబాబును ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్ అంటూ.. అంటూ విరుచుకుపడ్డారు వైసీపీ పార్లమెంటరీ సభ్యుడు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: