పెళ్లి చేసుకుంటాము కదా అని తొందర పడ్డారు.. చివరకు కాటిలో కలిసిన ఘటన రాష్ట్రంలో  సంచలం రేపుతోంది..ఇంటర్ లో ప్రేమించాడు... చాలా కాలం తర్వాత ఫేస్ బుక్ లో మళ్లీ కనెక్ట్ అయ్యారు. అది కాస్త ఇద్దరూ కలిసి ...సహజీవనం చేశారు చివర అనుమానాస్పదంగా చనిపోయి విగతాజీవులుగా పడ్డారు...అసలేం జరిగింది ఎందుకు వాళ్ళు చనిపోయారు అనే విషయాలను తెలుసుకొని ప్రయత్నమే పోలీసులు చేస్తున్నారు...


పూర్తి వివరాల్లోకి వెళితే... జీవీఎంసీ పరిధి 40వ వార్డులోని హుస్సేన్ నగర్ కు చెందిన విరీత్ రోహిత్(22)...పంజాబ్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. గతంలో నగరంలో ఇంటర్ చదువుతున్న సమయాంలోనే వారిద్దరి ఒకరిని విడిచి ఒకరు ఉండలేరేమో అన్నట్లు ప్రేమించుకున్నారు. అలానే కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి దూరమైంది. తాజాగా... అతనికి మళ్లీ ఆ అమ్మాయి ఫేస్ బుక్ లో తారసపడింది. అంతే వెంటనే మెసేజ్ చేశాడు.

 

ఆ మాటలు కాల్స్ కి దారి తీశాయి. అప్పుడెప్పుడో ఆగిపోయిన ప్రేమకు మళ్లీ చిగుళ్లు వేశాయి. దీంతో.. ఇద్దరూ మరోసారి తమ ప్రేమకు ప్రాణం పోశారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం కాస్తా ఇరువైపులా తల్లి దండ్రులకు తెలిసిపోవడంతో ఇద్దరు ఉద్యోగం సంపాదించిన తర్వాతే పెళ్లి అని పేరెంట్స్ తేల్చిచెప్పారు.దాంతో ఇద్దరు ఉద్యోగం వెతికే పనిలో పడ్డారు. 

 


అయితే... లాగూ పెళ్లి చేసుకుంటామని భావించిన వీరిద్దరూ మురళీనగర్‌ ఎన్జీజీవోఎస్‌ కాలనీలో ఇల్లు అద్దెకు ఇల్లు కూడా తీసుకున్నారు.యువతి నగరంలోని ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తుండగా రోహిత్‌ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య స్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం యువతి విధులకు వెళ్లిపోగా ఇంట్లో ఉన్న ఫ్యాన్ కు చీర బిగించి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.అతని మృతికి కారణం ఎవరు ఎందుకు చనిపోయాడు అనే వివరాలు తెలియాల్సి ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: