అక్కినేని నాగ చైతన్య.. నాగార్జున నట వారసుడిగా సినిమాల్లో నిలదొక్కుకుంటూ  తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించిన నాగచైతన్య మంచి విజయాలను కూడా అందుకున్నాడు. ప్రస్తుతం నాగార్జున నట వారసునిగా కొనసాగుతున్నాడు. ఇక 2019 సంవత్సరం చైతూకి  బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. రియల్ లైఫ్ భార్య భర్తలు అయిన అక్కినేని నాగచైతన్య సమంత రిల్ లైఫ్లో కూడా భార్యాభర్తలుగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. అంతే కాకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత సతీమణి సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ఓ బేబీ కూడా బ్లాక్బస్టర్ హిట్  అయ్యింది. దీంతో నాగచైతన్య లో మరింత జోష్ మరింత పెరిగింది. ఇక తాజాగా మరో లవ్ స్టోరీలో  నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

 ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. అయితే యువతలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ లో బాగా నటించగల నటుడు నాగ చైతన్య. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అటు  యువతరంలో కూడా ఎంతో ఆసక్తి నెలకొంది. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల ఎంతో ఆచితూచి ఎంపిక చేసుకున్న స్క్రిప్ట్ ఈ లవ్ స్టోరీ. ఈ సినిమాలో నాగచైతన్య నైజాం కుర్రాడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక శేఖర్ కమ్ముల గత సినిమా సెంటిమెంట్ ప్రకారం నిజాంబాద్ లో నాగచైతన్య పాత్ర ని ఎలివేట్ చేసే సీన్స్ కూడా తీస్తున్నారట. అయితే ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపిస్తూ అందరినీ అలరించిన నాగచైతన్య సినిమాలో మాత్రం పక్కా మాస్ యాస తో  అలరించబోతున్నాడు అని సమాచారం. 

 

 అయితే ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే నాగచైతన్య సరసన ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది.అయితే  ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ ఈ సినిమా చిత్రీకరణ మాత్రం శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నాగ చైతన్య సాయి పల్లవి లు ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న పోస్టర్ రిలీజ్ చేసి అందరిలో  ఆసక్తిని కలిగించారు శేఖర్ కమ్ముల. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో అటు  అభిమానుల్లో కూడా కాస్త అయోమయం నెలకొంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున.. సినిమాకు సంబంధించిన అప్డేట్స్ని ప్రేక్షకుల ముందుకు చిత్ర బృందం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ సినిమా. అంతేకాకుండా ఫిబ్రవరి ఈ చిత్రంలోని మరో రెండు పాటలు చిత్రీకరణ కూడా జరుగుతుందట . ఇక ఏప్రిల్లో ఈ  సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: