తమిళనాడు రాష్ట్రంలో గత మూడు రోజులుగా తమిళ సినీ ఇండస్ట్రీలో ఆదాయపు పన్ను శాఖ నిర్వహిస్తున్న రైడ్స్ గురించి అందరికి తెలిసిందే. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను హీరో విజయ్  ని టార్గెట్ చేశారని కొందరు, రాజకీయ నాయకులను ఏం చేయలేక సినీ ఇండస్ట్రీ వారిపై సోదాలా అంటూ ఆదాయపు పన్ను శాఖపై మరికొందరు విమర్శలు గుప్పించారు. ఈ పూర్తి వ్యవహారంలో మీరు సాధించింది ఏంటీ అంటూ ఐటీ అధికారులను ప్రశ్నిస్తున్న విజయ్ అభిమానులకు ఐటీ అధికారులు దిమ్మతిరిగిపోయే విషయాలను వారు చెబుతున్నారు. "బిగిల్" చిత్ర నిర్మాత అక్రమ ఆస్తులు కలిగి ఉన్న నగదు వివరాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి.

 

 

బిగిల్ చిత్రాన్ని నిర్మించిన కల్పాత్తి అఘోరా కుమార్తె అర్చన తన ట్విట్టర్ అకౌంట్ లో బిగిల్ చిత్రం జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల టాప్ 10 జాబితాలో నిలిచిందంటూ చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. దానితో ఐటీ అధికారుల్లో అనుమానం ఎక్కువైంది. చిత్ర నిర్మాత సమర్పించిన ఐటీ రిటర్న్స్, అలాగే హీరో విజయ్ సమర్పించిన ఐటీ రిటర్న్ ను పరిశీలించగా బిగిల్ సినిమాకు విజయ్ తీసుకున్న పారితోషికం, నిర్మాత ఇచ్చిన పారితోషికంను ఇద్దరు వేరు వేరుగా చెప్పారంట. దీనితో అక్కడ మొదలైన అనుమానంతో ఐటీ అధికారులు బిగిల్ చిత్ర నిర్మాణ సంస్థ అయిన ఏజీఎస్ ఆఫీస్ లలో సోదాలు చేశారు. బుధ, గురువారాల్లో ఏమాత్రం విరామం లేకుండా ఐటీ అధికారులు ఏజీఎస్ ఆఫీస్ లతో పాటు హీరో విజయ్ ఇంట్లో అలాగే ఆయన ఆఫీస్ లో సోదాలు నిర్వహించారు.

 

 

మాస్టర్ సినిమా షూటింగ్ లో ఉన్న విజయ్ ను షూటింగ్ ఆపివేసి మరీ చెన్నైకి ఐటీ శాఖ వారు ప్రభుత్వ కారులో తీసుకు రావడం చెప్పుకోదగ్గ విషయం. అలా ఆయన్ని చాలాసేపు పాటు విజయ్ ను విచారించడంతో పాటు ఆయన ఆస్తుల వివరాలను అలాగే ఇంట్లో ఉన్న నగదు, ఇతరత్ర విషయాలపై లెక్కలు తీసుకున్నారు. ఇక ఇంకోవైపు ఏజీఎస్ ఆఫీస్, నిర్మాత ఇంట్లో సోదాలు నిర్వహించగా డబ్బు కట్టలతో ఉన్న బ్యాగ్ లు అలాగే కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారం బయట పడ్డాయి. దాంతో దాదాపుగా 500 కోట్ల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లభించాయంటా.

 

 

ఇందులో ఏజీఎస్ ఆఫీస్ లో ఏకంగా 77 కోట్ల రూపాయల నగదు లభ్యం అవ్వడం ప్రస్తుతం పెద్ద షాకింగ్ గా ఉంది. తమిళ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా ఫైనాన్సియర్ గా, ఇంకా నిర్మాతగా కొనసాగుతున్న కల్పాత్తి అఘోరా మొత్తం అక్రమంగా బ్లాక్ మనీతోనే బిజినెస్ చేస్తున్నాడా అంటూ సినీ వర్గాల్లో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

 

 

డబ్బులను లెక్కించేందుకు చిన్న మెషన్స్ సరిపోక పోవడంతో బ్యాంకుల నుండి పెద్ద మెషన్స్ తెప్పించి మరీ అధికారులు దాదాపుగా మూడు గంటల పాటు లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. అఘోరా ఆఫీస్ లు, ఇళ్ల నుండి స్వాదీనం చేసుకున్న పత్రాలు అలాగే డబ్బు బంగారం విలువ కట్టి చూడగా దాదాపుగా 300 కోట్ల ఆదాయ పన్నును ఎగేసినట్లుగా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇక ఆ ఆదాయానికి అఘోరా సరైన లెక్కలు కూడా చూపించలేదంట.

మరింత సమాచారం తెలుసుకోండి: