గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనూష అనే యువతిని ముగ్గురు వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గురించి అనూష సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతిని దుండగులు హత్య చేయటానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. కానీ అనూష సోదరుడు అబద్ధం చెబుతున్నాడని పోలీసులు నమ్ముతున్నారు. క్లూస్ టీం ఆధారాల కోసం పరిశీలించగా అక్కడ కొత్త వ్యక్తులు ఎవరూ తిరగలేదని తేలింది. 
 
ఫిర్యాదు చేసిన అనూష అన్నే యువతిని హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరసరావుపేట రూరల్ పోలీసులు అనూష అన్నను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు కూడా యువతి సోదరుడే హత్య చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి రెండు గంటల సమయంలో అనూష హత్య జరిగినట్టు తెలుస్తోంది. 
 
మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీంకు కొత్త వ్యక్తుల ఆనవాళ్లు లభించకపోవటం, పోలీస్ డాగ్స్ కూడా కుమారస్వామి వద్దకే వెళ్లటంతో కుమారస్వామిని పోలీసులు విచారిస్తున్నారు. కుమారస్వామి మాత్రం తనకూ ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని ముగ్గురు వ్యక్తులు అర్దరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడ్డారని తనను కొట్టి తన చెల్లెలిని హత్య చేశారని కుమారస్వామి చెబుతున్నాడు. 
 
ముగ్గురు నిందితులు ఇంట్లోకి వచ్చి హత్య చేశారని ఎందుకు హత్య చేశారనే విషయం తనకు కూడా తెలియదని కుమారస్వామి చెబుతున్నాడు. ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు తరువాతే నిజనిజాలు తెలిసే అవకాశం ఉంది. స్థానికులు కూడా చెల్లిని చంపేసి ఏ పాపం తనకు తెలియనట్లు కుమారస్వామి నాటకాలు ఆడుతున్నాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: