టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మహేష్ టైం నడుస్తుంది. భరత్ అనే నేను అదేవిధంగా మహర్షి సినిమా లతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన మహేష్ ఈ సంవత్సరం సంక్రాంతిని టార్గెట్ చేసుకుని సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి మహేష్ కెరీర్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడం జరిగింది. కొత్త ఏడాదిని బ్లాక్ బస్టర్ విజయం తో అడుగు పెట్టిన మహేష్ బాబు ప్రస్తుతం కుటుంబ సమేతంగా ఈ సక్సెస్ ని అమెరికా దేశం న్యూయార్క్ పట్టణంలో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అమెరికా వెళ్లకముందు సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న మహేష్ బాబు అదే సమయంలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

ప్రస్తుతం స్క్రిప్టు దశలోనే ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టలేక బోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ ఎన్నడూలేని డిఫరెంట్ లుక్ లో ఒక స్పైగా కనిపించబోతున్నాడట. వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ అయిన తర్వాత మహేష్ వెంటనే మరో రెండు ప్రాజెక్టులను సెట్స్ పైకి తేవాలని ట్రై చేస్తున్నాడు. మహేష్ 28వ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. 

 

ఇక ఆ తరువాత అనిల్ రావిపూడితో కూడా మరో సినిమా చేయనున్నాడు. 30వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. వరుసగా నెక్స్ట్ 2, 3 ఇయర్స్ మహేష్ టాలీవుడ్ స్టార్ దర్శకులను ముందే బుక్ చేసుకున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా మహేష్ చేసుకుంటున్న ఈ ప్లాన్ తో ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. మరి సదరు డైరెక్టర్లతో ఎంతవరకు మహేష్ సక్సెస్ అందుకుంటాడో చూడాలి. మొత్తం మీద మహేష్ బాబు కోసం నలుగురు డైరెక్టర్లు క్యూ కట్టి ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: