సోషల్ మాధ్యమాల్లో పరిచయాలు అనేవి వినడానికి బాగుంటాయి. కానీ వాటి వల్ల మొదటిలో బాగుంటుంది. కానీ చివరిలో ఉన్నవి చాలా వింతగా ఉంటుంది. అయితే అలా పరిచయాలు అని వారు కొంత మంది లాంగ్ రిలేషన్ మైంటైన్ చేస్తారు మరి కొందరు మాత్రం అవసరాలకు వివిధ రకాల సుఖం కోసం మాత్రమే వాడుకొని వదిలేస్తారు. అయితే ఇప్పుడు ఒక పరిచయం ఎక్కడికో తీసుకెళ్లింది అని అంటున్నారు అదేంటో చూద్దాము.. 


ఓ మహిళకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడతను. ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ స్నేహంగా మారింది. కూల్ డ్రింక్ లో మత్తు టాబ్లెట్లు కలిపి తాగించాడు. స్పృహ కోల్పోయిన మహిళపై అత్యాచారానికి పాల్పడి.. వీడియో తీసి డబ్బు డిమాండ్ చేసేవాడు. అలా 50 లక్షలు వసూలు చేశాడు ఆ మోసగాడు. వేధింపులు తీవ్రతరం కావడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఈ మోసగాడి పేరు మామిడి సంజీవరెడ్డి. హైదరాబాద్ బాచుపల్లిలో సంజీవరెడ్డి, అతని భార్య కావేరి, మేనల్లుడు విశాల్ రెడ్డి నివాసముంటున్నారు. కొన్నాళ్లు అమెరికాలో ఉండి హైదరాబాద్ కోకాపేట్ కు వచ్చిన ఓ మహిళకు 2018లో ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. దానిని ఆమె అంగీకరించింది.

 

అలా పరిచయమయిన ఆమెను ఇండియాకు రప్పించాడు. వచ్చిన ఆమెను ఎయిర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత ఆమె వల్ల చెల్లి  ఇంట్లో వదిలేసాడు. అనంతరం మెనూ కూకట్ పల్లిలోని హోటల్ కు రమ్మని అడిగాడు. అతని కోరిక మేరకు ఆమె వచ్చింది. తన భార్య,మేనల్లుడికి పరిచయం చేసాడు. ఆతర్వాత భోజనము చేయనమని కోరగా ఆమె నిరాకరించింది. అయితే కూల్ డ్రింక్ ఇచ్చాడు మత్తు మందు వేసి మరి. 


 

మేనల్లుడు కలిసి నిజాంపేట్ కు తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై అత్యాచారం చేసి.. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. అప్పటి నుంచి సంజీవరెడ్డి ఆమెను బెదిరిస్తూ ప్రతినెలా డబ్బు వసూలు చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె వద్ద ఉన్న 30 తులాల బంగారం, చెక్కులు, 6వేల డాలర్లు లాక్కున్నాడు. ఇలా ఆమె వద్ద నుంచి 50 లక్షల వరకు దోచుకున్నాడితను. ఇంకా డబ్బు ఇవ్వాలని వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు సంజీవరెడ్డి, అతని భార్య కావేరి, మేనల్లుడు విశాల్ ను బీదర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఒకరి దగ్గర ఇంత లాగడంటే ఇంకా ఎంత మంది దగ్గర ఎంత లాగాడో అనే వివరాలను తెలుకొనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: