కొన్ని సంఘటనల గురించి వింటుంటే సమాజం ఏమైపోతుందో అన్న భయం కలుగుతుంది. పిల్లలను తల్లిదండ్రుల తరువాత అంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బంధువులే కామాంధులుగా మారి చిన్నారులను చిధిమేస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా బాలిక మీద కూడా దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటి దారుణ సంఘటనే ఒకటి ఇటీవల వెలుగుచూసింది. చిన్నారి సొంత మామే గదిలో బంధించి 24 రోజుల పాటు అత్యాచారం చేశాడు.

 

మైనర్ బాలికను ఎత్తుకెళ్లి గదిలో బంధించిన ఆమె బంధువు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల వెలుగుచూసింది. ఆమె ఎక్కడికీ పారిపోకుండా గదికి తాళం వేసి మరి ఆ బాలికతో తన కామవాంచ తీర్చుకున్నాడు. బాలిక కనిపించకుండా పోయిందని కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టారు. చివరకు బాలిక బంధువే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిస షాక్‌ అయ్యారు.

 

మహారాష్ట్రలోని జల్నా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికను ఆమె మామ బలవంతంగా ఎత్తుకెళ్లాడు. బుల్ధనా జిల్లాలోని ఓ గ్రామంలోని ఇంట్లో ఆమెను బంధించి చిత్ర హింసలకు గురిచేశాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. సుమారు 24 రోజులు పాటు దారుణంగా రేప్ చేశాడు. బాలిక పారిపోకుండా గదికి తాళం వేసి నిద్రాహారాలు లేకుండా హింసించాడు.

 

బాలిక అదృశ్యం వెనక ఆమె బంధువే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారని ఆ వ్యక్తికి తెలియటంతో బాలికతో సహా పారిపోయేందుకు ప్రయత్నించాడు. చివరకు ఔరంగాబాద్ పట్టణంలోని ఓ బస్టాప్‌లో బాలికతో సహా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు పట్టుకునే సమయంలో బాలిక తీవ్రగాయాలతో బాధపడుతోంది. దీంతో పోలీసులు వెంటనే ఆ బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాదితురాలి కుటుంబ సభ్యులు ఆ దుర్మార్గున్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: