మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి ఉన్న విషయం తెలిసిందే. ఆడపిల్ల కాలు బయట పెట్టాలంటేనే  భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల బయటికి వెళ్ళింది అంటే మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందో లేదో అని తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. ఆడపిల్లలపై అత్యాచారాలు చేసే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికి కూడా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయి మృగాళ్ల మీద పడి పోతున్నారు. ఇక వావి వరసలు మరిచి మరి ఆడపిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకు ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఓ మైనర్ బాలికను కొన్ని రోజులపాటు గదిలో బంధించి మామ అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. 

 


 బాలిక అక్కడి నుంచి తప్పించుకు  పోకుండా ఉండేందుకు గదిలో పెట్టి తాళం వేసి రోజూ అదే పనిగా అత్యాచారం చేశాడు. బాలిక అదృశ్యం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఎట్టకేలకు తన స్టైల్లో విచారణ చేసి నిందితుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని బుల్దానా  జిల్లా మెకర్ తహసీల్  ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను ఆమె మామ బలవంతంగా ఎత్తుకెళ్లాడు. బుల్ధనా జిల్లాలోని మేకర్ తాసిల్ గ్రామంలో ఓ  ఇంట్లో ఆమెను బంధించాడు. అంతేకాకుండా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇరవై నాలుగు రోజులుగా అదేపనిగా దారుణంగా రేప్ చేశాడు. ఇక బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... విచారణలో ఆ బాలికను సమీప బంధువు మామ వరుస అయ్యే వ్యక్తి ఎత్తుకెళ్లడానికి గుర్తించారు. 

 


 అయితే పోలీసులు ఆ బాలిక కోసం గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో... ఆ బాలికను ఒకచోటి నుంచి మరోచోటుకు మారుస్తు  నిందితుడు అటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడం తో పాటు బాలికపై అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు గురిచేశాడు. చివరికి ఔరంగాబాద్ పట్టణంలోని ఓ బస్టాప్లో బాలికతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాలికను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: