ఇద్దరు యువతీయువకులు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ, కొన్ని రోజుల తర్వాత విభేదాలు రావడంతో బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా మాజీ ప్రియురాలిపై కోపం పెంచుకున్న ప్రియుడు ఆమెపై పగ సాదించాలనుకున్నాడు. దీనితో వారు ఏకాంతంగా గడిపిన సమయంలో తీసుకున్న ఫొటోలను నేరుగా సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీనితో ఆ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది.

 

 

ఒడిశా రాష్ట్రంలోని జైపూర్ జిల్లాలో ఉన్న కంటిగడియ మలంద్‌ పూర్ గ్రామానికి చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతితో గత సంవత్సరం పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని కలియ తిరిగారు. కొద్ది రోజుల తర్వాత విభేదాలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. ఈ విషయంతో పగబట్టిన మాజీ ప్రియుడు కిరాతనికి ఒడిగట్టాడు.

 

Image result for మాజీ ప్రియురాలి  ఫొటోలు సోషల్ మీడియాలో

 

వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలను ప్రియుడు ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన బంధువులు, స్నేహితులందరికీ యువతి ఫొటోలను షేర్ చేశాడు. దానితో ఈ విషయం ఆమెకు తెలిసింది. తన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులను ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు.

 

 

అయితే ఈ నిందితుడు మాజీ ప్రియురాలి కుటుంబానికి డబ్బు అప్పుగా ఇచ్చాడని అది తిరిగి ఇవ్వమని ఆమెను కోరాడు. దీనితో ఆమె ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతోందని, అందుకే ఆగ్రహం చెందిన మాజీ ప్రియుడు ఆమె ఫొటోలను ఆన్‌ లైన్‌ లో ఉంచాడని అనుమానిస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి తెలిపారు. కాబట్టి ప్రేమికులు జాగ్రత్త సుమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: