వైసిపి పార్టీ నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. గతంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాడు రఘురామకృష్ణ రాజు. తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఢిల్లీ సాక్షిగా ఆయన చేసిన కామెంట్లు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా మరియు జాతీయ స్థాయిలోని పెద్ద హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా వైసిపి పార్టీ ఎంపీలతో చాలా తక్కువగా ఉంటూ బిజెపి పార్టీ తో చాలా దగ్గరగా వ్యవహరించడంతో రఘురామకృష్ణ రాజు వైఖరి వైసీపీ పార్టీ వర్గాల పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

ఇటువంటి తరుణంలో తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ ప్రి రిలీజ్ వేడుకలో ఎంపీ రఘురామకృష్ణ రాజు గెస్ట్ గా హాజరయి ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు అంటూ యాంకర్ సుమ ప్రశ్నించగా...టైం లో ఆ నలుగురు హీరోయిన్లతో నేను ఉండాలని కోరుకుంటున్నానని అందరికీ షాక్ ఇచ్చే విధంగా కామెంట్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో విజయ్ దేవరకొండ కి అమ్మాయిలు అభిమానులు ఎక్కువ ఉన్నారు లవర్స్ ఎక్కువగా ఉన్నారు ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు.

 

సినిమాకి పని చేసిన నలుగురు హీరోయిన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాతో కె.ఎస్.రామారావు మరిన్ని విజయాలు సాధించాలని అప్పట్లో చిరంజీవి తో ఎన్ని సినిమాలు తీయడం జరిగిందో...అటువంటి రోజులు భవిష్యత్తులో మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. దీంతో రఘురామకృష్ణరాజు వరల్డ్ ఫేమస్ లవర్ ప్రి రిలీజ్ వేడుకలో ఇచ్చిన స్పీచ్ ఇండస్ట్రీకి హైలెట్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: