టాలీవుడ్, బాలీవుడ్ లో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు రాంగోపాల్ వర్మ.  శివ సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సృష్టించిన ఆయన దెయ్యం, రాత్రి సినిమాలతో హర్రర్ కి కొత్త భాష్యం చెప్పారు.  ఇక మని, మనీ మనీ సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.  ఎలాంటి సినిమా అయినా ఆయనది ప్రత్యేకమైన మార్క్ ఉండేలా చూస్తారు రాంగోపాల్ వర్మ.  ఆయన శిష్యులుగా వచ్చిన వారిలో టాప్ డైరెక్టర్స్ గా ఎదిగారు. వారిలో కృష్ణవంశి, పూరి జగన్నాధ్.. రీసెంట్ గా ఆర్ ఎక్స్ 100 మూవీతో వచ్చిన అజయ్ భూపతి.  ఈ మద్య రాంగోపాల్ వర్మ ఎక్కువగా కాంట్రవర్సీ సినిమాలే తీస్తున్నారు.  కాంట్రవర్సీ అంటే తనకు ఇష్టమని.. తాను ఎవరి మాటలు పట్టించుకోనని.. తనకు ఇష్టమొచ్చింది చేస్తానని పలు ఇంటర్వ్యూలో చెబుతున్న విషయం తెలిసిందే.

 

 అందుకే సినీ పరిశ్రమంలో ఆయనతో ఎవరూ పెట్టుకోరు. తన మనసులో ఏముంటుందో సెటైర్ గా కుండ బద్దలు కొట్టినట్టుగా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్ స్ట్రా గామ్ లో పెట్టేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు రాంగోపాల్ వర్మ.  తాజాగా ఆయన తాతయ్య అయ్యారు. ప్రస్థుతం అమెరికాలో డాక్టర్ గా ఉంటున్న రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి తల్లి అయింది.  అయితే తన కూతురికి కూతురు పుట్టింది..తనకు మనవరాలు వచ్చిందన్న సంతోషంలో ఎంతో భావోద్వేగంతో తెలిపారు రాంగోపాల్ వర్మ.  దాంతో ఆయనకు సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

అయితే రాజమౌళి మాత్రం చాలా వెరైటీగా చెప్పారు. కంగ్రాచ్యులేషన్స్ రామూ తాతయ్య గారూ. చిట్టచివరకు మీకు కళ్లెం వేసేందుకు మీ మనవరాలు వచ్చేసింది. ఇక మిమ్మల్ని ఏమని పిలవాలి? రామూ తాతా, రానూ నాన్నా లేదా గ్రాండ్ పా రామూ?" అని ప్రశ్నించారు.  తాజాగా ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: