శ్రీకాకుళం జిల్లాలోని రాజాం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. రాజాం పట్టణం డోలపేట రవీంద్రభారతి విద్యా వికాస్ స్కూల్ లో గుర్తు తెలియని వ్యక్తి పదవ తరగతి విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. స్కూల్ యాజమాన్యం గాయపడిన విద్యార్థినిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటన గురించి సమాచారం బయటకు రాకుండా స్కూల్ సిబ్బంది గోప్యంగా ఉంచారు. 
 
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలలోకి వెళితే పదో తరగతి చదువుతున్న సత్యవతి అనే విద్యార్థినిపై ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తి బ్లేడుతో దాడి చేశాడు. బాలిక బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో ఒక వ్యక్తి అక్కడ బ్లేడ్ తో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అక్కడే పడిపోగా విద్యార్థులు స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. 
 
పోలీసులు విద్యార్థులను, స్కూల్ యాజమాన్యాన్ని విచారిస్తున్నారు. ఆధారాలను మాయం చేసిన స్కూల్ యాజమాన్యం తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు తమకు సమాచారం ఇవ్వలేదని స్కూల్ యాజమాన్యాన్ని పోలీసులు ప్రశ్నించారు. స్థానికంగా ఈ వార్త కలకలం సృష్టిస్తోంది. గతంలో కూడా ఆ వ్యక్తి బాలిక వెంట పడ్డాడని బాలిక ఆ వ్యక్తిని దూరంగా పెట్టటం వలనే దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది. 
 
ఆ వ్యక్తి స్థానికంగా ఉండే వ్యక్తే అని విద్యార్థినికి పరిచయం ఉన్న వ్యక్తే అని పోలీసులకు ప్రాథమిక విచారణలో తెలిసినట్లు సమాచారం అందుతోంది. స్కూల్ యాజమాన్యం ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బాలిక గాయాల రక్తపు మరకలను కూడా తుడిచివేశారని తెలుస్తోంది. ఈరోజు సాయంత్రానికి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: