అతనో మాజీ ఎంపీ... చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. టీడీపీలో సీనియర్ నాయకుడైన ఈ మాజీ ఎంపీకి ప్రైవేట్ బస్సులు కూడా ఉన్నాయి. ఈ బస్సులకు సంబంధించి ప్రయాణికుల నుండి ఫిర్యాదులు రావడంతో పాటు నిబంధనలు పాటించటం లేదని పలుమార్లు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. తాజాగా ఈ సీనియర్ నాయకుడి బస్సుల్లో గతంలో వ్యభిచార దందా కూడా జరిదింగని జోరుగా ప్రచారం జరుగుతోంది. 
 
ఈ ప్రచారాన్ని కూడా ఈ నాయకుడి బస్సుల్లో ప్రయాణం చేసిన ప్రయాణికులు నిజమేనని చెబుతూ ఉండటం గమనార్హం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ సీనియర్ నాయకుడి బస్సుల్లో వ్యభిచార దందా జరిగింది. ఆ సమయంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉండగా అధికారులకు కూడా ఈ వ్యభిచార దందా గురించి తెలుసని సమాచారం. గతంలో ఎంపీగా ఉన్న ఈ నాయకుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాడు. 
 
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఈ నేత సీఎం జగన్ పై ఎప్పుడూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. గతంలో అధికార పార్టీలోకి రావాలని ఈ సీనియర్ నేత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రస్తుతం కూడా టీడీపీ పార్టీలోనే ఉన్న ఈ సీనియర్ నేత తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అధికార పార్టీ నేతల చేత చివాట్లు తింటున్నాడు. తాజాగా ఈ సీనియర్ నాయకుని బస్సుల గురించి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. 
 
బస్సులు నడపడంలో అన్నీ సరిగ్గా ఉండాలంటే కష్టం అని ఈ సీనియర్ నేత వ్యాఖ్యలు చేయడంతో వ్యభిచార దందా పుకార్లు నిజమేనేమో అని సామాన్యుల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ వ్యభిచార దందా గురించి విచారణ చేస్తే మాత్రం విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నిజంగా ఈ నాయకుడికి చెందిన బస్సుల్లో వ్యభిచార దందా జరిగిందా...? లేదా...? అనే చర్చ జోరుగా జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: