కొందరి పుట్టుకకు ఒక మంచి కారణం ఉంటుంది. ఎందుకంటే వారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తనను తాను బ్యాలన్స్ చేసుకుంటూ, నలుగురికి సాధ్యమైనంత వరకు సహాయ పడుతూ బ్రతుకుతారు. మరికొందరు రాక్షస అంశంతో పుడతారేమో.. ఎప్పుడు నలుగురిని పక్కలో వేసుకోవడం. ఎదుటి వారు బాధపడుతుంటే చూస్తూ ఆనందించడం చేస్తుంటారు..

 

 

ఇదేగాక మరికొందరు పేరు ప్రతిష్టల కోసం చేయరాని అడ్డమైన పనులను చేస్తూ ఎప్పుడు నలుగురి నోటితో, చేతులతో దుమ్మెత్తి పోయించుకుంటారు.. ఇక ఇదంతా పక్కన పెడితే ఎప్పుడు ఎవరో ఒకరితో తిట్టించుకోకుండా నిదురపోనీ కత్తి మహేశ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు..

 

 

అది కూడా హిందువుల మనో భావాలను దెబ్బతీసేలా ప్రవర్తించాడు.. అతని నోటి దూల ఎలా ఉందో అందరికి తెలిసిందే అని కొందరు అనుకుంటున్నారట. ఇకపోతే  ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్ ఇటీవల శ్రీరాముడి ఫేవరెట్ డిష్ నెమలి తొడ, జింక మాంసం..’ అంటూ చేసిన పోస్టులు వివాదాస్పదంగా మారగా, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ మహేశ్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండి పడుతున్నారు.

 

 

అంతే కాకుండా, శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది కరుణసాగర్ ఫిర్యాదు చేయగా, మహేశ్ పై హైదరాబాద్ లోని నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాగా మహేశ్ పై ఇవే ఆరోపణలతో, పలు పీఎస్ లలో ఫిర్యాదులు అందుతున్నట్టు సమాచారం..

 

 

ఇకపోతే కొందరు రామ భక్తులు మహేష్ చేసిన పనికి నోటి దూల ఉండాలే గాని, మరీ ఇంతలా ఉండకూడదని, నీ కత్తి యవ్వారలు కట్టిపెట్టి బుద్ధిగా ఉండాలని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైన ఓ కత్తి మహేశా నీకివన్ని అవసరమా నీపనేదో నువ్వు మూసుకుని చేసుకోక అని ఘాటుగానే స్పందిస్తున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: