గతంలో నాగబాబు జబర్దస్త్ ‌షోపై ఆరోపణలు చేసి.. అదిరింది షోకి వెళ్లారు. కానీ.. ఇప్పుడు నాగబాబు మళ్ళీ జబర్దస్త్ కి రావాలనే ఆలోచన చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. పైగా గెటప్ శ్రీను లాంటి వాళ్లు దీన్ని కన్ఫర్మ్ కూడా చేసారు. కానీ మల్లెమాల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేకుండా నాగబాబు ఎంట్రీకి నో ఎంట్రీ బోర్డ్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన రావడం మల్లెమాలకు పెద్దగా ఇష్టం లేదని చెబుతున్నాయి జబర్దస్త్ వర్గాలు.

 

అయితే.. అసలు నాగబాబు కెరీర్ కి మళ్లీ రెక్కలు తొడిగిందే ఈ కామెడీ షో. అప్పట్లో ఆయన ఆరెంజ్ సినిమా చేసిన తర్వాత కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. ఓకానోక సమయంలో అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుందామని అనుకున్నాడు  నాగబాబు. అలాంటి సమయంలో ఆయన కెరీర్‌ కు మళ్లీ ఊపిరి ఊదింది జబర్దస్త్ కామెడీ షో. అలాంటి షోను వదిలేసి వెళ్లిపోయాడు. ఈయన  వెళ్లే సమయంలో చాలా మంది సర్ది చెప్పారు. మంచి పారితోషికం వచ్చినపుడు తప్పేం లేదని, కొందరు లైఫ్ ఇచ్చిన షోను వదిలేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది అంటూ బాబుకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆయన మాత్రం కాదనుకుని వెళ్లిపోయాడు.

 

ఈయన వెళ్ళాక జీ తెలుగులో అదిరింది అంటూ మరో షో మొదలు పెట్టాడు. అయితే జబర్దస్త్ కామెడీ షోకు ధీటుగా ఈ షోని వెళ్లిపోయారు. కానీ.. ఆ షో ఇప్పటి వరకు కూడా జబర్దస్త్ షోపై ప్రభావం చూపించింది మాత్రం తక్కువే. మరోవైపు నాగబాబు లేకపోయినా కూడా జబర్దస్త్ మాత్రం దుమ్ము దులిపేస్తూనే ఉంది. ఇప్పటి వరకు కూడా జబర్దస్త్ రేటింగ్స్‌ లో టాప్‌ లోనే ఉంది. దానికి తోడు అదిరింది షోకు రేటింగ్స్ తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ జబర్దస్త్ ‌షోకు రావాలనే ఆలోచన నాగబాబు చేస్తున్నాడనే వార్తలొచ్చాయి. కానీ.. దీనిపై నాగబాబు స్పందించాల్సి ఉంది.

 

ఇప్పుడు మల్లెమాల రానివ్వకపోవడానికి కారణం అందరికి తెలిసిందే.. వెళ్లేప్పుడు మామూలుగా వెళ్లిపోయుంటే నాగబాబుకు అసలు సమస్యే ఉండేది కాదు. కానీ ఈయన మల్లెమాల పై చాలా విమర్శలు చేసాడు.  మళ్లీ జబర్దస్త్‌ కు రావాలనుకుంటున్న కూడా నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం ఆయన ఎంట్రీకి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: