విజయవాడ ఎంపీ కేశినేని నానీ అంటే చాలు ఇప్పుడు విపక్ష టీడీపీలో సీనియర్ నేతలు సైతం మండిపడుతున్నారు. ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మమ్మల్ని తిట్టడం ఏంటీ అంటున్నారు మాజీ మంత్రి దేవినేని ఆగ్రహంగా ఉన్నారు. నన్ను మించిన బాబు భక్తుడు ఎవడూ అనుకునే విజయవాడ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా కేశినేని పేరు వింటే కస్సుమంటున్నారు. అందుకే తన మాట వినే అధికార ప్రతినిధి పట్టాభితో కేశినేని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇప్పించారు.



ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో కేశినేని నానీ ఒక సోషల్ మీడియాలో పోస్ట్  చేశారు. దాని సారాంశం ఏంటీ అంటే, జగన్ ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం ఏబీ అని, అసలు వైసీపీ అధికారంలోకి రావడం ఆయన చలువే అంటూ కేశినేని  పోస్ట్ చేసారు. వాస్తవానికి ఏబీ చంద్రబాబుకి అత్యంత సన్నిహిత అధికారి మరి. ఆ మాట అనగానే బాబు గారికి మండింది గాని పైకి కేశినేని ఏమీ అనలేక సైలెంట్ అయ్యారు. ఎందుకు అనలేదు అంటే, కేశినేనికి బిజెపి అగ్రనేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ని ఆర్ధికంగా పోషించే నితిన్ గడ్కారికి సన్నిహితుడు.



అందుకే బెజవాడ ఫ్లైఒవర్ ని అంత త్వరగా పూర్తి చేయించారు అంటూ ఉంటారు ఆ పార్టీ కార్యకర్తలు. అది నిజమో ఆబద్దమో వాళ్ళకే తెలియాలి గాని, ఇప్పుడు నేతలకు బాబు క్లాస్ పీకుతున్నారట. కేశినేనికి కి కాస్త హాస్య చతురత ఎక్కువలే గాని మీరు లైట్ తీసుకోండి అంటూ నేతలకు చెప్తున్నారు. ఇక పార్టీలో నేనే నెంబర్ వన్, కృష్ణా జిల్లాలో నా గుమ్మం తోక్కేది ఎవరూ అనుకునే మాజీ మంత్రి ఉమాకు కూడా బాబు కాస్త బుజ్జగింపు కార్యక్రమం చేశార‌ని టాక్‌.



అందుకే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో నానీ స్నేహం చేస్తున్నా ఉమా ఏమీ అనలేకపోతున్నారు. మైలవరం విజయవాడ పార్లమెంట్ పరిధిలోదే కాబట్టి ఎంపీ, ఎమ్మెల్యే ఏదొకటి మాట్లాడుకుంటారని, వాటిని చూసి అలగవద్దని చెప్పారట ఉమాకు. ఏదేమైనా కేశినేని బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారార‌ట‌.  

మరింత సమాచారం తెలుసుకోండి: