మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్న  విషయం తెలిసిందే. అత్యాచారాలు చేసిన వారిని శిక్షించేందుకు ఎన్నో  కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దీంతో కామాంధుల నుంచి ఎటు నుంచి ఎప్పుడు ఆపద పొంచి ఉందని మహిళలు భయంతోనే బ్రతకాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఆడది బయటికి వెల్లిందంటే  చాలు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా అని భయం తోనే బతుకుతున్నారు తల్లిదండ్రులు. అయితే హైదరాబాదులో దిశగా ఘటనలో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపినప్పటికీ  కూడా ఇంకా కామందుల తీరులో మార్పు రావడం లేదు. వరుస అత్యాచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. 

 

 

 తాజాగా ఇలాంటి ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో ఓ ప్రయాణికురాలిని  బెదిరించి దారుణంగా అత్యాచారం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేటకు చెందిన 37 ఏళ్ల మహిళ తన 12 ఏళ్ళ కుమారులతో కలిసి కర్ణాటకలోని బీదర్ నుంచి హైదరాబాద్ కు బస్సు లో వస్తోంది. బస్సు పస్తాపూర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే.. ముగ్గురు వ్యక్తులు ఆ మహిళ వద్దకు వచ్చారు. తాము  పోలీసులమని.. మీ లగెజ్ లో   నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఉన్నాయంటూ వాటిని తనిఖీ చేయాలని ఆమెను బస్ లోంచి  కిందికి దింపారు. మహిళ వచ్చింది నిజమైన పోలీసులే అనుకోని  నమ్మి బస్సు దిగింది. ఈ నేపథ్యంలో లగేజ్ ను  పరిశీలిస్తూ ఇద్దరు వ్యక్తులు మహిళ కుమారుని తమా వద్ద  ఉంచుకున్నారు. 

 

 

 ఇక మరో వ్యక్తి తనతో మాట్లాడాలి అని చెప్పి ఆ మహిళను పాడుబడిన బంగ్లాకు  తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక వారి నుంచి తప్పించుకుని ఆ మహిళ జరిగిన అఘాయిత్యం  పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన జహీరాబాద్ సిఐసైదేశ్వర్, ఎస్సై   వెంకటేశు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులమంటూ నమ్మించి ఆమె పై అత్యాచారం చేసిన నిందితులు ఎవరు అనే  దానిపై ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: