ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధం కారణంగా చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. లేదా అడ్డువచ్చిన వారిని అతికిరాతకంగా పొడిచి చంపి అడ్డు తొలగించుకుంటున్నారు.. అయితే ఈ క్రమంలో అన్నీ పూర్తిగా మర్చిపోతున్నారు కూడా.. వివరాల్లోకి వెళితే.. పెళ్లైయ్యాక కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నా ఓ వ్యక్తి  వల్ల కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అసలు సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాము. 

 


జె.పంగులూరు మండలం చందలూరు బీసీ కాలనీకి చెందిన జి.వేణు, ధనలక్ష్మి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. అద్దంకిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో నివాసం ఉంటూ బేల్దారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వేణుకు చీమకుర్తి మండలం నాయుడుపాలేనికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ ఇద్దరికి వేరు వేరు వ్యక్తులతో వివాహం అయింది. అంతేకాకుండా పిల్లలు కూడా ఉన్నారు. 

 


వివాహేతర సంబంధం కారణంగా రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నాయుడుపాలేనికి చెందిన మహిళ కుటుంబం కొద్దినెలల క్రితం హైదరాబాద్‌ వెళ్లి అక్కడ జీవనం సాగిస్తోంది. వేణు ఎన్టీఆర్‌నగర్‌లో ఉంటున్నారు. హైదరాబాద్‌లో నివాసముంటున్న మహిళ ఇటీవల అద్దంకి వచ్చింది. వేణుతో కలిసి స్వగ్రామం అయిన నాయుడుపాలేనికి ద్విచక్ర వాహనంపై సోమవారం వెళ్లింది.

 

అయితే తన భర్తతో వేరే మహిళా ఉండటం గమనించిన అతని భార్య పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకోబోయింది. స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం వేకువజామున మృతి చెందారు. వేణు మృతదేహానికి అద్దంకి ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఒక్క అక్రమ సంబంధం భార్య భర్తల ప్రాణాలను తీసుకొని పిల్లలను అనాథలుగా మార్చారు.. ఈ విషయం ప్రస్తుతం విషాద ఛాయలను అలముకొనేలా చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: