ఎన్ని చట్టాలు చేస్తున్నా, ఎంత మంది మీద చర్యలు తీసుకుంటున్నా కామాంధులు మాత్రం ఆగంట లేదు. అమానుష ఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆరేళ్ల పాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు కామ పిశాచాల బారిన పడి చిద్రమైపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది.

 

సోలాపూర్ జిల్లాలో 16 ఏళ్ల దళిత బాలికపై 10 మంది దుర్మార్గులు దారుణంగా అత్యాచారం చేశారు. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా ఆరు నెలల పాటు ఆ అమ్మాయిని బంధించిన చిత్రవధ చేశారు. పోలీసు విచారణలో తను ఎదుర్కొన్న భయానక పరిస్థితిల గురించి వివరించింది ఆ అమ్మాయి. ఆ విషయం విన్న ఖాకీలు కూడా కంట నీరు పెట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దారుణానికి పాల్పడిన 10 మందిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.


వివరాల్లోకి వెళ్తే  ఒక గుడి దగ్గర 16 ఏళ్ల అమ్మాయి ఏడుస్తున్నట్లు కొంతమంది స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయి తండ్రి కొద్ది రోజుల క్రితమే మరణించాడు. తల్లితో కలిసి అక్కడే నివసిస్తున్న ఆ అమ్మాయి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆ సమయంలో తనకు పరిచయం అయిన కొంత మంది ఆకతాయి అబ్బాయిలే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.


వీరిలో కొందరు అల్లరి చిల్లరగా తిరగుతుండగా మరి కొందరు ఆటో రిక్షాలు నడుపుతున్నారు. ఈ కుర్రాలంతా కలిసి ఆ అమ్మాయిని ఆరునెలలకు పైగా వివిధ ప్రదేశాలకు తీసుకెళ్లి అత్యాచారం చేశారని అధికారి తెలిపారు. అమ్మాయి ఇచ్చిన సమాచారం మేరకు విజయపూర్ నాకా పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే పట్టుపడిన నింధితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: