ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రత అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రతినిత్యం కమాండోలు అప్రమత్తంగా ఉంటూ డేగ కళ్ళతో, ఒళ్ళు అంతా కళ్ళు చేసుకుని ఉండాలి. ఆయన భద్రత కోసం, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పిజి)ని కేంద్రం నియమించింది. దేశంలో ఆ భద్రత ఉన్న ఒకే ఒక వ్యక్తి మోడీ కావడం విశేషం. అప్పట్లో  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాకి పెద్ద ఎత్తున  భద్రత ఉండేది. 

 

2019-20లో నలుగురు ఎస్పీజీ కమాండోల భద్రతకు గాను బడ్జెట్ కేటాయింపులలో రూ .540.16 కోట్లుఇచ్చారు. ఇందులో సెక్యూరిటీ కవర్ తలసరి వ్యయం 135 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే పిఎం మోడీ సహా గాంధీ కుటుంబాన్ని ముగ్గురు గాంధీలను రక్షించడానికి సగటున ఒక్కొక్కరికి 135 కోట్ల రూపాయలు. దాంతో పోలిస్తే ఎస్పీజీ తలసరి ఖర్చు దాదాపు 340 శాతం పెరిగింది. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య తరువాత ఎస్పీజీ ఉనికిలోకి వచ్చింది. 

 

ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రధానమంత్రి మరియు వారి కుటుంబ రక్షణ కోసం ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. రాజీవ్, సోనియా మరియు వారి పిల్లలు రాహుల్ మరియు ప్రియాంక గాంధీలకు తర్వాత ఆటోమేటిక్ గా ఎస్పీజీ భద్రతను కేంద్రం కల్పిస్తుంది. మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2015-15 నుండి ఇది దాదాపు రెట్టింపు అయింది.  2014-15లో ఎస్పీజీకి రూ .289 కోట్లు కేటాయించారు, ఇది 2015-16లో రూ .330 కోట్లకు పెరిగింది. 2020-21లో బడ్జెట్ కేటాయింపుల్లో మరో 10 శాతం పెంపుతో, ప్రధాని మోడీకి ఎస్పీజీ కవర్ ఖర్చు బాగా పెరిగింది. 

 

592 కోట్ల రూపాయల వద్ద, ప్రధానిని రక్షించడానికి ఖర్చు రోజుకు సుమారు 1.62 కోట్ల రూపాయలు అదే గంటకు అయితే 6.75 లక్షలు, నిమిషానికి 11,263 రూపాయలు. దీనిని సిఆర్‌పిఎఫ్ సెక్యూరిటీ కవర్‌తో భర్తీ చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఎస్పీజీ బడ్జెట్ పెరుగుతూనే ఉంది... అని చెప్పడంలో యెంత మాత్రమూ... అతి శయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: