ప్రజాస్వామ్యంలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఇది. చట్టాలను పరి రక్షించాల్సిన ఓ పోలీసు అధికారి మితిమీరి, మతిపోయి కట్టుకున్న భార్యనే చిత్రహింసలకు గురి చేసాడు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యను పట్టించుకోకుండా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇదేంటని నిలదీసిన భార్యను నడిరోడ్డుపై చితకబాదాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్తూ చిత్రహింసలు పెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

 

మధ్యప్రదేశ్‌లోని గంద్వాడీ పోలీస్‌స్టేషన్ ఇంఛార్జిగా ఉన్న నరేంద్ర సూర్యవంశికి భార్య, పిల్లలున్నారు. కొంతకాలంగా కుటుంబాన్ని పట్టించుకోకుండా మరో మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతడిని గట్టిగా నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన ఆ పోలీసుల అధికారి మహిళ అని కూడా చూడకుండా ఆమె నడిరోడ్డుపైనే చావబాదాడు. నడి రోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ... వెళ్లాడు. 

 

కొసమెరుపు ఏమిటంటే.. ఈ దారుణాన్ని మిగతా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు... ఇంకా అదేదో చోద్యంలా... ఒక సినిమా చూస్తున్న మాదిరి, చూస్తూ ఉండిపోయారు. కొందరు నరేంద్ర ఆపే ప్రయత్నం చేయగా.. ఆయన మరింత రెచ్చిపోయి భార్యను చావబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నరేంద్రను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు.

 

ఇలాంటి దిక్కుమాలిన సంఘటనలు మనకు కొత్తేమి కాదు.. మొన్నటికి మొన్న... ఒక దౌర్భాగ్యుడు.. నికృష్టుడు.. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో అదనపు కట్నం భార్యను భర్త దొడ్డుకర్రతో చావబాదాడు. అతనితో పాటు.. అతని తమ్ముడు కూడా ఆ మహిళను శారీరకంగా చిత్ర హింసలు పెట్టాడు. సదరు మహిళ యొక్క తల్లిదండ్రులు అదనపు కట్నం ఇచ్చుకోలేరని చెప్పడంతో ఆమెను పట్టుకుని దొడ్డుకర్రతో.. రోకలి బండతో చితక బాదడం మనం చూసాము... దేశం ఎటు వెళుతుందో అర్ధం కావట్లేదు.... ప్రపంచం పతనమయే సమయం ఆసన్నమైంది...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: