ఈ మధ్య కాలంలో కామాంధుల వీరంగం రోజు రోజుకు ఉదృతంగా మారుతుంది. అయితే దిశా లాంటి అమాయకులు ఎందరో ప్రాణాలను కోల్పోతున్న కూడా కామ కోరికలు తీర్చుకునే మృగాళ్లు మాత్రం ఆగడం లేదు. చట్టాలు ఎన్ని వచ్చిన కూడా చిన్నారులపై ఆగడాలు, హత్యలు ఎక్కడ తగ్గిన దాఖలు కనపడటం లేదు. అయితే వావి వరుసలు కూడా పూర్తిగా మర్చిపోయి మరి ప్రవర్తిస్తున్నారు.

 

ఈ లోకంలోని మగాళ్లుగా పిలిపించుకునే మృగాళ్లు.. ఉదయం లేచినప్పటి నుండి ఎవరొకరు ఈ కామాంధుల చేతులతో బలి అయ్యారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..  చిన్నారిని బిస్కెట్లు ఇస్తానని ఆశచూపి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. పసిమొగ్గపై అమానుషంగా అత్యాచారం చేశాడు. అనంతరం విషయం అందరికీ తెలిసిపోతుందేమోనని పాపను గొంతునులిమి చంపేశాడు.

 

బాలిక అదృశ్యం కావడంతో గాబరాపడిన తల్లిదండ్రులు పరిసరాల్లో వెతికినా కూతురి ఆచూకీ లభించకపోవడంతో కంగారు పడ్డారు. చివరికి.. దారుణంగా రేప్‌, హత్యకు గురైన ఆ చిన్నారి చెప్పులే హంతకుడిని పట్టించిన ఘటన వెలుగుచూసింది.చిన్నారి మృత దేహం చుసిన తల్లి దండ్రులు కన్నీటి పర్యంతం చేశారు. ఈ మేరకు పోలీసులకు పిర్యాదు చేయడమే కాకుండా, వాడిని వెంటనే ఉరి తీయాలంటూ పొలిసు స్టేషన్ ఎదుట బయటాయించి ఆందోళనలు చేపట్టారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. కేసును సమగ్రంగా విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

 

మహోలీ పట్టణంలో నివాసం ఉంటున్న దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది. దంపతులు పనిమీద ఓ రోజు సమీపంలోని సీతాపూర్ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన కామాంధుడు ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఆశచూపి ఇంటికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడ బయటకు పొక్కుతుందనని చిన్నారి గొంతు నులిమి చంపేశాడు. చిన్నారి మృతదేహాన్ని ఓ సంచిలో చుట్టేసి పెరట్లో బక్కెట్ కింద దాచేశాడు. సైలెంట్‌గా పని పూర్తి చేసిన హంతకుడు ఏమీ ఎరగనట్టు చేతులు దులుపుకున్నాడు. చివరికి  చిన్నారి చెప్పులే ఆ మృగాన్ని కటకటాలు తీసుకెళ్లాయి. ఈ విషయంపై పలువురు మహిళా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: