ఫిబ్రవరి 13వ తేదీన ఒక్కసారి చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జనాలు జరిగాయి.మరి ఒకసారి హిస్టరీ లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి..!
సరోజినీ నాయుడు జననం : స్వతంత్ర సమరయోధురాలు కవయిత్రి అయిన సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13వ తేదీన జన్మించారు. సరోజిని నాయుడు 1925 సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు కి తొలి మహిళా అధ్యక్షురాలిగా కూడా కొనసాగారు. అంతేకాకుండా భారతదేశపు తొలి గవర్నర్ గా కూడా ఆమె రికార్డు సృష్టించారు. దేశం బానిసత్వం నుంచి విముక్తి పొందాక భారత మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని నిరూపించిన వీర మహిళల్లో ఒకరు సరోజిని నాయుడు. సరోజినీ నాయుడు మంచి రచయిత్రి కూడా. అయితే సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ్ సుప్రసిద్ధ పండితుడు ఈయన ఎనిమిది భాషలలో... కవితలు రాసేవారు. భారతదేశ చరిత్రలో గొప్ప స్వతంత్ర సమరయోధురాలు గానే కాకుండా... గొప్ప రాజకీయ నాయకురాలిగా కూడా సరోజినీ నాయుడు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచి పోయింది. అంతే కాకుండా భారత కోకిలగా కూడా సరోజినీ నాయుడు పేరుగాంచింది.
గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి జననం : సుప్రసిద్ధ పండితులైన ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి 1880 ఫిబ్రవరి 13వ తేదీన జన్మించారు. జొన్నలగడ్డ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంస్కృతం అభ్యసించారు. ఈయన ఎన్నో స్తోత్రాలను కూడా రచించారు. సమస్త దేవతా రూపంలోని లోకేశ్వరుడి పై స్త్రోస్త్రాలు రచించారు గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి. కేనోపనిషత్తు కఠోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు మండకోపనిషత్తు మొదలైన గ్రంథాలను రచించారు గట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి.
మాదాల నారాయణస్వామి జననం : సీనియర్ కమ్యూనిస్టు నాయకుడైన మాదాల నారాయణస్వామి 1914 ఫిబ్రవరి 13వ తేదీన జన్మించారు. ఎంఎన్ఎస్ గా ప్రసిద్ధి గాంచాడు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో జన్మించిన మాదాల నారాయణస్వామి ఉత్తమ కమ్యూనిస్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచిన మాదాల నారాయణస్వామి... భారత్-చైనా మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగించిన తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా ఒంగోలు శాసన సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు మాదాల నారాయణస్వామి. 1962లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పలు పదవుల్లో పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పని చేశారు మాదాల నారాయణస్వామి. రైతు కూలీల సమస్యలు... కార్మిక సంఘాల సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించి వాటి సాధన కోసం పోరాడారు.
నూతి శంకర్రావు జనం: ఆర్య సమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుల్లో ఒకరైన నూతి శంకరరావు 1930 ఫిబ్రవరి 13వ తేదీన మెదక్ జిల్లా టెక్నాల్ లో జన్మించారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు నూతి శంకరరావు. పండిట్ నరేంద్రజీ, వినాయకరావు విద్యాలంకార్ వంటి ప్రముఖుల ప్రసంగాలు వల్ల ప్రభావితులైన నూతి శంకరరావు ఆర్య సమాజ సమ్మేళన జరిపించాడు. ఇక 1948 మార్చి లో అరెస్టు కాబడిన నూతి శంకరరావు ఆ తర్వాత విమోచనోద్యమ అనంతరం విడుదలయ్యారు. 1951లో రెవెన్యూ శాఖ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం నుండి కలెక్టర్ గా కూడా పని చేశారు ఈయన.
నూనె శ్రీనివాసరావు జననం : ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయిన నూనె శ్రీనివాసరావు 1972 ఫిబ్రవరి 13వ తేదీన ప్రకాశం జిల్లాలోని చీరాల లో జన్మించారు. సామాజిక సేవలో 16 సంవత్సరాలుగా వివిధ పథకాలతో ముద్నుకెళ్తున్నాడు నూనె శ్రీనివాసరావు.