ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్...పేరు చెప్పగానే అందరికీ ముందు గుర్తొచ్చేది ఆయన చేసే సర్వేలు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే చల్లి సంచలనం సృష్టించిన విషయం. అయితే ఇదంతా ఆయన పోలిటికల్ కెరీర్ పరంగా జరిగిన సంఘటనలు. కానీ పర్సనల్ లైఫ్ పరంగా కూడా ఆయన కొన్ని సంచలనాలే సృష్టించాడు. అది కూడా పెళ్లి విషయంలో ఆయన జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

 

మామూలుగా లగడపాటి మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర కూతురు పద్మను పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే లగడపాటి ఎప్పుడైతే ఎంపీగా గెలిచారో అప్పటి నుంచి ఆయనకు ఓ డాక్టర్ మీద ప్రేమ పుట్టింది. అది కూడా భర్తకు విడాకులు ఇచ్చిన డాక్టర్ ఆమె. అయితే లేటు వయసులో ఘాటు ప్రేమ రావడంతో, లగడపాటి ఆమెని రెండో వివాహం చేసుకున్నాడు. కాకపోతే ఈ విషయం గురించి ఎవరికి పెద్దగా తెలియదనే అనుకోవాలి.

 

ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం అధికారికంగా ఎక్కడ బయటకు రాలేదు. అయితే 2009 ఎన్నికల అఫడవిట్‌లో అసలు విషయం బయటకొచ్చింది. 2004లో తనకు ఇద్దరు కుమారులు మాత్రమేనని ఎన్నికల అఫిడవిట్లో తెలియజేసిన ఆయన.... 2009లో సమర్పించిన అఫిడవిట్లో మాత్రం తనకు ముగ్గురు కూమారులని చెప్పారు. మూడో కుమారుడి పేరు ఎల్.హర్మన్ అని పేర్కొన్నారు. దాంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. లగడపాటి జానకి అనే మహిళను రెండవవివాహం చేసుకున్నారని, వారిద్దరికీ జన్మించిన పుత్రుడే హర్మన్ అని అర్ధమైంది.

 

మొత్తానికి ఈ విధంగా లగడపాటి లేటు వయసులో మరో పెళ్లి చేసుకునే సంచలనమే సృష్టించారు. ఇదిలా ఉంటే లగడపాటి 2014లో రాజకీయాల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక రాజకీయాల నుంచి తప్పుకున్న ఆయన సర్వేలు చేయడం మాత్రం ఆపలేదు. అయితే 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో, 2019 ఏపీ ఎన్నికల్లో ఆయన సర్వేలు విఫలం కావడంతో, మళ్ళీ ఆయన మీడియా ముందు కనిపించలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: