ఇటీవల కాలంలో మహిళల పై పోకిరీలు చేసే ఆగడాలు ఎక్కువ అయిపోయాయి. ప్రభుత్వం ఎన్ని కటినంగా చట్టాలు తెచ్చినా మహిళలు, బాలికల పై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు చట్టాలు తెస్తే ఏంటీ.. అమలు పరిస్తే కదా.. అనుకుంటున్నారు కాబోలు..

 

 

17 ఏళ్ల బాలికకు మత్తుమందు ఇచ్చి బాలిక నగ్న చిత్రాలను చిత్రించి లొంగీసుకోవడానికి ప్రయత్నించాడు ఓ దుండగుడు.. వివరాల్లోకి వెళితే..నగరానికి చెందిన ఓ బాలిక (17) చదువు కోసం రెండేళ్ల కిందట కర్నాటకలోని బీదర్‌ కు వెళ్లి బంధువుల ఇంట్లో ఉండేది. స్థానికంగా నివసించే వివాహితుడైన శివకుమార్‌ (23) తో ఫ్రెండ్‌ షిప్ పేరిట ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

 

 

ఆపై బాలికను వలలో వేసుకుని మత్తుమందు ఇచ్చి ఆమె నగ్న చిత్రాలు తీసి వేధిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. 

 

 

కాగా., ఓ రోజు బలవంతంగా శివకుమార్ ఆ బాలికను ఓ హోటల్‌‌ కి తీసుకెళ్లి కూల్‌ డ్రింక్‌ లో మత్తుమందు కలిపి తాగించాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక దుస్తులు తొలగించి నగ్నంగా ఫోటోలు తీశాడు. అప్పటి నుంచి బాలికకు ఆ ఫోటోలు చూపిస్తూ కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించసాగాడు. దీంతో ఆమె ఏడాది కిందట హైదరాబాద్‌ కు వచ్చేసింది. శివకుమార్‌ కూడా మూడు నెలల కిందట నగరానికి వచ్చి ఓ మద్యం దుకాణంలో పనికి చేరాడు. ఆమె ఫోన్ నంబర్ సేకరించి తనతో బీదర్ రావాలంటూ బెదిరిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో నగ్నచిత్రాలు కుటుంబసభ్యులకు వాట్సాప్‌ లో పంపించాడు..

 

 

దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. అతడి పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: