ప్రేమికుల రోజు ఎంతో మంది ప్రేమికులకు ఓ తీపి జ్ఞాపకం. ఎన్నో మధురానుభూతులను కలిగించిన రోజు ఈ ప్రేమికుల రోజు. నేటి యువత తమ ప్రియమైన వారికి ప్రేమికుల రోజున తమ మనసులోని ప్రేమను తెలిపేందుకు ముందుకు వస్తే నేటి తరం పెద్దలు ఆనాడు ప్రేమించిన వారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ప్రేమ వివాహం చేసుకున్న వారు తమ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏదేమైనా ప్రేమికుల రోజు వచ్చింది అంటే మాత్రం.. ప్రేమికుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అప్పటి వరకూ తమ మనసులో దాచుకున్న ప్రేమను ప్రేయసికి చెప్పడానికి సిద్ధపడతారు చాలా మంది యువత. అంతేకాకుండా అప్పటికే పెళ్ళి చేసుకున్న వారు  తమ ప్రియమైన వారికి ఎన్నో సర్ప్రైజ్ లు  ఇస్తూ ఉంటారు. 

 

 

 అయితే కేవలం నేటితరం యువత నే కాదు ప్రస్తుతం రాజకీయాల్లో  బాగా రాణిస్తున్న వారు కూడా ఒకప్పుడు ప్రేమ వివాహం చేసుకున్న వారే. ప్రేమ వివాహం చేసుకున్న వారిలో మన తెలంగాణ రాజకీయాల్లో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. అలాంటి ప్రేమ వివాహం చేసుకున్న వారిలో ఒకరు కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో కీలక నేతగా కొనసాగుతున్న దామోదర రాజనర్సింహ ఆ నాటి ప్రేమ కథ వింటే మాత్రం అదుర్స్ అనాల్సిందే. ఆ రోజుల్లోనే అందరిని ఎదిరించి మరీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు దామోదర రాజనర్సింహ. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోయినా అందరిని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. 

 

 

 దామోదర రాజనర్సింహ సతీమణి రెడ్డి, కానీ దామోదర రాజనర్సింహ మాత్రం ఎస్ సి అయినప్పటికీ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు దామోదర రాజనర్సింహ. ఈయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక దామోదర రాజనర్సింహ భార్య గత ఎన్నికల ముందు బిజెపి పార్టీలో జాయిన్ అయింది. అయితే భర్త కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్నప్పటికీ భార్య బిజెపిలో జాయిన్ అవ్వడం సంచలనం సృష్టించింది. ఇక కొద్ది సమయంలోనే మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తుంది. కాగా  కాంగ్రెస్ కీలక నేత అయిన దామోదర రాజనర్సింహ భార్యకు దేవూళ్ళను పూజించడం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఎప్పుడు స్వాములను కలుస్తూ ఉంటుంది ఈమె.

మరింత సమాచారం తెలుసుకోండి: