మహిళతో శారీరక సుఖం అనుభవించిన తరువాత ఆమె తల తదితర చోట్ల నరాలు కట్ చేసి అత్యంత కిరాతకంగా బండరాయితో దాడి చేసి హత్య చేశారు. అటువైపు వెళ్లిన వారు విషయం గుర్తించి గట్టిగా కేకలు వేసి అక్కడి నుంచి పరుగు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలంలో పరిశీలించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. 

 

 

పోలీసుల కథనం ప్రకారం...తమిళనాడులోని విల్లుపురం దక్షిణ రైల్వే కాలనీలో గత నెల 14వ తేదీ 35 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. రాళ్ల దాడితో శరీరం మొత్తం గాయాలైనాయని ప్రభుత్వ వైద్యుల నివేదికలో వెలుగు చూసింది. మహిళ శరీరం మీద ఎలాంటి డ్రెస్ లేకపోవడం, ఆమె శరీరంలోని నరాలు కట్ చెయ్యడంతో మొత్తం గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది.

 

 

అయితే.. హత్యకు గురైన మహిళ అదే రోజు రాత్రి 17 ఏళ్ల బాలుడితో ఆ ప్రాంతంలో తిరిగిందని స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విల్లుపురం దక్షిణ రైల్వే కాలనీలో చాల వరకు పాడుపడిన ఇండ్లు ఉన్నాయి. అదే రైల్వే కాలనీలోని పాడుపడిన ఇండ్ల దగ్గర గత 14వ తేదీ రాత్రి 17 ఏళ్ల బాలుడు, ఓ మహిళ తిరుగిన విషయం తాము చూశామని కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే a మహిళతో 17 ఏళ్ల బాలుడికి అక్రమ సంబంధం ఉందని, ఆ రోజు రాత్రి తాను ఆమె పాడుపడిన రైల్వే కాలనీలోని ఇంటిలో శారీరకంగా కలిశామని బాలుడు పోలీసులకు చెప్పాడు.

 

 

తనతో శారీరక సుఖం అనుభవించిన తరువాత ఆ మహిళ తనకు డబ్బులు ఇవ్వాలని చెప్పిందని, లేదంటే తనను రేప్ చేశావని మీ తల్లిదండ్రులకు, పోలీసులకు చెబుతానని ఆమె బెదిరించిందని, భయంతో బండరాయి తీసుకుని ఆమె తలమీద దాడి చేసి నరాలు కట్ చేసి చంపేశానని బాలుడు పోలీసులకు చెప్పారు. శారీరక సుఖం కోసం ఆమె శరీరం మీద బట్టలు మొత్తం తీసేసిన బాలుడు అదే స్థితిలో ఉన్న ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు బాలుడు అంగీకరించాడని పోలీసులు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: