హాయిగా సాగిపోతున్న దాంపత్య జీవితం లోకి మూడో వ్యక్తి రావడం ... ఆ తర్వాత అక్రమ సంబంధం ఏర్పడడం.. ఈ అక్రమ సంబంధం కాస్త ఎక్కడికో దారితీయడం... ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో రోజుకు ఒకటి జరుగుతూనే ఉన్నాయి. భార్యను మోసం చేసే భర్తలు... భర్తలను మోసం చేసే భార్యలు నేటి రోజుల్లో ఎక్కువై పోతున్నారు. కట్టుకున్న బంధం కంటే... అక్రమ సంబంధం మేలు అంటున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. పోలీసు వృత్తిలో ఉంది అందరికీ రక్షణ కల్పిస్తూ ఇన్స్పిరేషన్ గా ఉండాల్సిన ఓ మహిళ..నీచంగా  ప్రవర్తించి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక భార్యపై అనుమానం వచ్చిన భర్త మాటువేసి రెడ్హ్యాండెడ్గా భార్యను పట్టించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

 మనసా వాచా భర్తతో నడుస్తానని పెళ్లిలో ఇచ్చిన కట్టుబాట్లు అన్నింటినీ మర్చిపోయి మరో వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగించింది మహిళా కానిస్టేబుల్. ఈ ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం లో చోటుచేసుకుంది. అయితే ఆ మహిళా కానిస్టేబుల్ భర్త తన భార్య మోసం చేస్తుంది అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పార్లీ  గ్రామానికి చెందిన సునీల్ రాజు ఆర్మీలో పని చేస్తున్నాడు. పదేళ్ల క్రితం కంభం పట్టణానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అనూష  తో  అతడికి వివాహం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక విధుల నిమిత్తం సునీల్  ఆర్మీ లోకి వెళ్లడంతో... ఏకాంతాన్ని  తట్టుకోలేక పోయిన మహిళా కానిస్టేబుల్  అనూష మరో వ్యక్తితో అక్రమ సంబంధానికి తెరలేపింది. అయితే ఈ విషయాన్ని గమనించిన భర్త సునీల్ గతంలో భార్య తీరుపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.. 

 

 ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యల్లో భాగంగా మహిళా కానిస్టేబుల్ అనూష ను సస్పెండ్ చేశారు. ఇక సస్పెన్షన్కు గురైన అనూష కొద్దిరోజుల వరకు ఎంతో బుద్ధిగానే నడుచుకుంది. ఇటీవలే అధికారులు విధించిన సస్పెన్షన్ పూర్తికావడంతో వేటపాలెం పోలీస్ స్టేషన్లో విధుల్లో చేరినది  మహిళా కానిస్టేబుళ్లు అనూష. ఇక విధుల్లో చేరిన తర్వాత తన తీరు మాత్రం మారలేదు అని తెలిసింది. ప్రియుడితో  మళ్లీ అక్రమ సంబంధం కొనసాగించడం మొదలు పెట్టింది. దీంతో విసిగిపోయిన భర్త సునీల్  రాజ్  మంగళవారం రాత్రి ఆమెను ప్రియుడితో గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని  వెంటనే వేటపాలెం పిఎస్ కు వెళ్లి ఆధారాలతో సహా భార్య పై ఫిర్యాదు చేశాడు భర్త.

మరింత సమాచారం తెలుసుకోండి: