తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్... యువరత్న నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి వివాహం పెద్దలు కుదిర్చింది అన్నది తెలిసిందే. చంద్రబాబు, బాలయ్య బావ బావ మరుదలు కావడంతో అనేక కోణాల్లో ఆలోచించి వీరి వివాహం జరిగినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే ఈ వివాహానికి ప్రధాన కారణం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 

 

నారా బ్రాహ్మణిని కోడలిగా చేసుకోవడానికి చంద్రబాబు తటపటాయిస్తున్న‌ సమయంలో భువనేశ్వరి నారా బ్రాహ్మణీయే తనకు కోడలు గా రావాలని భీష్మించి ఈ పెళ్లి చేసినట్టు కూడా ఓ ప్రచారం ఉంది. ఇక చంద్రబాబు సైతం నందమూరి కుటుంబ అభిమానులను శాశ్వతంగా తన వైపునకు తిప్పుకునే క్రమంలోనే అన్నివిధాల ఆలోచించి బ్రాహ్మణిని తన కోడలుగా చేసుకున్నారు. ఇది ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా నిజం. ఇదిలా ఉంటే వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహమే కాదు.. వీరి మ‌ధ్య ప్రేమ కూడా న‌డిచింద‌ట‌. లోకేష్‌, బ్రాహ్మ‌ణి బావ, మరదలు కావడంతో చిన్నప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ న‌డిచింద‌ని నందమూరి, నారా కాంపౌండ్ మనిష్యుల మ‌ధ్య‌ అంతర్గతంగా వినిపించే మాట.

 

బ్రాహ్మ‌ణి, లోకేష్ ఇద్ద‌రూ ఉన్న‌త విద్య అభ్య‌సించిన వారే. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు చిన్న‌ప్పుడే ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ్డార‌ని టాక్‌. అలా చిన్న వ‌య‌స్సు నుంచే వీరి ప్రేమ న‌డిచిన‌ట్టు టాక్‌.. ? ఇక వీరిద్ద‌రికి తాత అయిన దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్ సైతం త‌న మ‌న‌వ‌డు, మ‌న‌వ‌రాలు పెళ్లి చేసుకుంటే బాగుంటుంద‌ని ఆశించేవార‌ట‌. అయితే ఆయ‌న 1995లోనే మృతి చెందినా చివ‌ర‌కు ఆయ‌న కుమార్తెగా నారా భువ‌నేశ్వ‌రి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ బ్రాహ్మ‌ణిని త‌న కోడ‌లిని చేసుకుని త‌న తండ్రి కోరిక తీర్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: