మనం జీవిస్తున్నది మనుషులున్న సమాజమేనా అని అనుమానం కలుగుతుంది.. ఎందుకంటే రావణ రాజ్యంలో కూడా రాక్షసులు ఇంత ఘోరాతి ఘోరాలు చేయలేదేమో, కంప్యూటర్ యుగమని చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజులు ఇప్పుడు కళ్లముందు ఉన్నాయి.. టెక్నాలజీ కాలంలో మనుషులు కామంతో కళ్లు మూసుకుని ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు అని తెలిసి ఉంటే అసలు ఈ టెక్నాలజీలను డెవలప్ చేయకపోవడమే మంచిది.

 

 

మనుషులు మనుషుల్లా జీవించడం మరచి, పశువులకంటే హీనంగా, తోడేళ్ల తోలు కప్పుకుని, వెకిలి చేష్టలు చేస్తూ సమాజం సిగ్గుపడేలా బ్రతుకుతున్నారు. కనీసం సభ్యతగల సమాజంలో మనం బ్రతుకుతున్నాం, నా ఇంటిలో కూడా ఆడవారు ఉన్నారనే జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించే తీరు మనిషిని ఛీదరించుకునేలా చేస్తుంది. ఇకపోతే ఆడవారు కనిపిస్తే చాలు చిత్తకార్తి కుక్కల్లా వెంటపడుతున్నారు కొందరు. వారి ముందు వేసే వేషాలను చూస్తే కోసి కారం పెట్టాలన్నంత ఆవేశం కొందరికి వస్తుందట.. ఇక తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ యువకుడు చేసిన పని తెలిస్తే ఇది చదివిన ప్రతి వారు ఆవేశంతో ఇలాగే ఆలోచిస్తారు..

 

 

ఢిల్లీ మెట్రోలో ఓ యువతి తన ఆఫీస్‌ పనులు ముగించుకుని సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి గురుగ్రామ్‌ వెళ్లేందుకు మెట్రో రైలు ఎక్కింది. ఆ కాసేపటి తరువాత ఓ యువకుడు వచ్చి ఆ ఎదురుగా నిలుచుని, అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడట. అతని ప్రవర్తన ఎంత అసహ్యం కలిగిస్తుందంటే, ట్రైన్‌లోనే ప్యాంట్‌ జిప్‌ తీసి తన ప్రైవేట్ పార్ట్ బయటకు తీసి ఎదురుగా ఉన్న యువతికి చూపిస్తూ నీచంగా ప్రవర్తించసాగాడట. ఇదే కాకుండా అతి తెలివి తేటలు ప్రదర్శిస్తూ, తన ప్రైవేట్‌ పార్ట్‌ని బయటే ఉంచి వేరేవారికి కనిపించకుండా బ్యాగ్‌ను అడ్డుపెట్టుకున్నాడట.

 

 

ఊహించని ఈ ఘటనతో భయపడిపోయిన ఆ యువతి. ఈ భయానక అనుభవాన్ని ఎవర్వికి చెప్పుకోలేక ఇంటికి వెళ్లిన తర్వాత, తాను ఎదుర్కొన్న ఈ దారుణ అనుభవాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేయగా, ఆ ట్వీట్‌కు డీఎంఆర్‌సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) స్పందించింది. ఇలాంటి సంఘటనలు ఎదురైతే.. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని సూచించింది. ఇక ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని గుర్తించే పనిలో పడ్డారట.. ఇప్పుడు చెప్పండి మనం మనుషులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజుల్లో బ్రతుకుతున్నామన్న విషయం నిజమా కాదా..? 

మరింత సమాచారం తెలుసుకోండి: