ప్రేమ ఒక మధురమైన జ్ఞాపకం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. సినీ ప్రముఖుల జీవితంలో ప్రేమ 90 శాతం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఇంకా రాజకీయ నాయకుల ప్రేమలు అయితే జరగడం చాలా అరుదు. ఎందుకంటే వారి జీవితం మొత్తం ప్రజలు.. గొడవలు.. పదవులు, విమర్శలే ఎక్కువ ఉంటాయి.. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయనాయకులు.. నాయకురాళ్లు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 

 

వారు ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ అప్పట్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం పెరుగు కూడానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు అలాగే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు సైతం ప్రేమ వివాహం చేసుకున్నారు. 

 

అందులో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని తన భర్తను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక మరో ఎమ్మెల్యే.. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సైతం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. ఆమె ఎస్సి క్యాటగిరీకి చెందిన రెడ్డి సామాజివర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 

 

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సైతం కాపు వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీ దేవి ఆమె భర్త ఇద్దరు డాక్టర్లు కావడం విశేషం. ఇప్పుడు డాక్టర్ ఎమ్మెల్యే అయ్యారు. ఇక తెలంగాణ నుంచి ప్రభుత్వ విప్ గా ఉన్నా బాల్క సుమన్ గౌడ వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అలాగే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ బాబు సైతం ప్రేమ వివాహం చేసుకున్నారు. అలాగే మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత నీ ప్రేమ వివాహమే. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ది కూడా ప్రేమ వివాహమే. మన రాజకీయ నాయకులలో ఇంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: