ఈ మధ్యకాలంలో దొంగబాబాలు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. బాబాల  ముసుగులో కామాంధులుగా మారి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దొంగ బాబాల ఎంతోమంది గుట్టు  ఇప్పటికే రట్టయినా  విషయం తెలిసిందే. తాజాగా మరో దొంగ బాబా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి తల్లి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనారోగ్యాన్ని నయం చేస్తానని దారుణానికి  ఒడిగట్టాడు ఓ తాంత్రికుడు . ఉత్తరప్రదేశ్ షహనాజ్పూర్  జిల్లాలో ఈ ఘటన జరిగింది. కాగా ఈరోజు ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... జిల్లాలోని కూతార్  గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త అనారోగ్యం తో బాధ పడుతున్నాడు. 

 

 

 అయితే అతడి అనారోగ్యాన్ని నయం  చేయాలంటూ ఔరంగాబాద్కు చెందిన ఓ తాంత్రికుడు సాగిర్ ఖాన్ ను  కలిసింది సదరు మహిళా. తన భర్తకు అనారోగ్యాన్ని నయం చేస్తాను  అంటూ ఆ తాంత్రికుడు ఆ మహిళను నమ్మబలికాడు. ఆమె భర్తకు దయ్యం పట్టిందని మాయమాటలు చెప్పాడు.  భర్తకు పట్టిన దయ్యాలను పారద్రోలాలంటే కొన్ని పూజలు చేయాలంటూ  చెప్పాడు . ఫిబ్రవరి 9న పూజల కోసం ఆమె ఇంటికి వెళ్లాడు ఆ తాంత్రికుడు .తనతో పాటు ఇద్రీస్  అనే ఓ అసిస్టెంట్ ను కూడా తెచ్చుకున్నాడు. అనారోగ్యంతో ఉన్న సదరు మహిళ భర్త ను ఒక రూమ్ లో బంధించాడు. ఆ మహిళ మీద అత్యాచారానికి ఒడిగట్టాడు ఆ తాంత్రికుడు.

 

 

 ఆ తరువాత 12 సంవత్సరాల కుమార్తే  పై కూడా లైంగిక దాడికి పాల్పడ్డారు ఇద్దరు . ఇక  జరిగిన ఘటనపై బాధిత మహిళా  పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు తెలిపి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కాగా  పారిపోయిన మరో నిందితుడు ఇద్రిస్ కోసం వెతుకుతున్నారు పోలీసులు. కాగా  ఎన్నో రోజుల నుంచి తాంత్రిక శక్తులు ఉన్నాయంటూ ప్రజల నుంచి.. మోసాలకు పాల్పడుతున్న తాంత్రికుడి  గుట్టురట్టయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: