దేశంలో రోజు రోజుకు క్రైమ్ రేటు పెరిగిపోతూనే ఉన్నది.  ఈ క్రైమ్ రేటును ఎంతగా తగ్గించాలని చూస్తున్న కుదరడం లేదు. పోలీసులు, చట్టాలు, కోర్టులు ఎన్ని శిక్షలు విధించినా తగ్గకపోగా రోజు రోజుకు పెరిగిపోతున్నది.  దీంతో ప్రజలు పోలీసులు సైతం ఒక్కోసారి చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తోంది. తాజాగా హైదరాబాద్ లో ఓ దారుణ సంఘటన జరిగింది.  అదేమంటే, పిల్లనిచ్చిన అత్తను, భార్యను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.

 
అక్కడితో ఆగకుండా ఆ డెడ్ బాడీలను ఎవరికి కనిపించకూడదు అని చెప్పి తీసుకెళ్లి నల్లవాగులోని ఓ ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడు.  కానీ,తప్పు చేసిన వ్యక్తి దొరక్కుండా ఉండడు కదా.  అలానే జరిగింది.  హత్య చేసి మృతదేహాలను ఓ ఇంట్లో పడేసి వెళ్లిపోయిన తరువాత చుట్టుపక్కల ఉండే వ్యక్తులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.  


ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేయడం మొదలుపెట్టారు.  భార్యను, అత్తను హత్య చేసింది అల్లుడు రెహ్మాన్ అని ప్రాధమిక విచారణలో తేలింది.  అత్త ఫరీదా బేగం, భార్య ఫైజాబేగం తో నిత్యం అల్లుడు రెహ్మాన్ గొడవ పడేవాడట.  ఆర్ధిక లావాదేవీల విషయంలో ఇలాంటి గొడవలు జరుగుతుండేవని విచారణలో తేలింది.  అత్తను, భార్యను హత్య చేసిన రెహ్మాన్ అక్కడి నుంచి పారిపోయాడు.  


ఎక్కడి వెళ్ళాడో తెలియదు.  పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన పాతబస్తీలో కలకలం రేపింది.  అసలే పాతబస్తీలో ఎప్పుడు ఎలాంటి గొడవలు జరుగుతాయో అని భయపడిపోతున్నారు.  అలాంటి సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం అంటే ఇబ్బందికరమైన అంశం అని చెప్పాలి.  ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినపుడు కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అవుతాయిగాని, ఇలా హత్య చేస్తే సమస్య పరిష్కారం కాకపోగా మరింతగా పెరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: