ముంబైలో జరుగుతున్న నాస్కామ్ టెక్నాలజీ లీడర్ షిప్ ఫోరమ్ 2020 కార్యక్రమంలో తెలంగాణ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పాల్గోన్నారు. march to $5Trillion Economy : Reality or ambitious అనే అంశంపైన టెక్ మహీంద్రా యండి సిపి గుర్నాని నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. దేశం 5 ట్రిలియన్ డాలర్ల అర్ధిక వ్యవస్ధ దిశగా పయనించాలంటే తీసుకోవాల్సిన చర్యలు, రూపొందించాల్సిన విధానాలపైన చర్చించారు. తెలంగాణ నూతన రాష్ట్రం అయినప్పటికీ, వేగంగా అభివృద్ది చెందుతున్నదని, కేవలం సేవారంగంలోనే కాకుండా మ్యాన్యూఫాక్చరింగ్, వ్యవసాయ రంగంలోనూ దేశ వృద్దిరేటుని మించి దూసుకుపోతున్న నేపథ్యంలోతెలంగాణ అనుభవాలను పంచుకోవాలని మంత్రి కేటీఆర్‌ను సిపి గుర్నాని కోరారు. దీంతోపాటు 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి అభిప్రాయాలను అడిగారు. 

 


దేశాభివృద్ది పట్ల అశావాహ దృక్పథంతో ఉన్నానన్న మంత్రి కేటీఆర్, ఇంతటి భారీ లక్ష్యాన్ని అందుకోవాలంటే దైర్యంతో కూడిన వినూత్న నిర్ణయాలను(bold decisions) కేంద్రం తీసుకోవాల్సిన అవసరముంద‌ని విశ్లేషించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి నిర్ణయాలను దేశం అశించిందని, అయితే ప్రజల అకాంక్షల మేరకు కేంద్రం  నిర్ణయాలు తీసుకోలేక పోయిందన్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా దేశ అర్ధిక వ్యవస్ధ మందగమనంలో ఉన్నదని, కేంద్రం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అర్ధిక గణాంకాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయన్నారు. కేంద్రం తన శషబిషలు వదిలి రాష్ట్రాలకు మరింత అర్ధిక స్వేచ్చ ఇవ్వాల్సిన సమయం అసన్నమైనదన్నారు. రాష్ట్రాలు వేగంగా ఎదిగితేనే దేశం ఎదుగుతుందన్న సత్యాన్ని గుర్తించాలన్నారు. టీమ్ ఇండియా, ఫెడరల్ వంటి పదాలను అచరణలో చూపాల్సిన సమయమిదన్నారు. వీటితోపాటు ఫిస్కల్ ఫెడరలిజాన్ని అనుసరించాలని సూచించారు. 

 

తెలంగాణ లాంటి వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల‌కు మూలదన లభ్యత ప్రధాన సమస్యగా ఉన్నదన్న మంత్రి కేటీఆర్..., దేశం వేగంగా అభివృద్ది చెందాలంటే మౌళిక వసతుల కల్పన కోసం భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అమెరికా, జపాన్, యూరప్ లోని పలు దేశాల మాదిరి చవకైన మూలదనాన్ని సేకరించి ఖర్చు చేయాలని సూచించారు. తెలంగాణ లాంటి పలు రాష్ట్రాల విధానాలు, వనరులు, వాతావరణం నచ్చి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వీదేశీ కంపెనీలు, అర్ధిక సంస్ధలకు కఠినమైన కేంద్ర నిబంధనలు అడ్డంకులుగా మారాయన్నారు. అభివృద్ది కార్యక్రమాల కోసం భారీగా నిధులను ఖర్చు చేయనప్పుడు 5 ట్రియలియన్ డాలర్ల అర్ధిక వ్యవస్ధ సాద్యం అవ్వడం సవాలే అన్నారు.  ఈ సమస్యను పరిష్కరించేందుకు FRBM వంటి పరిమితులను కేంద్రం సవరించాలని సూచించారు. దేశంలో మౌళిక వసతుల కల్పన కోసం నిధులను సేకరించి ఖర్చు చేస్తే అప్పులు పెంచుతున్నారంటూ చేస్తున్న వాదన అత్యంత సంప్రాదాయిక అర్ధిక అలోచన అని, అభివృద్ది చెందిన అన్ని అర్ధిక వ్యవస్ధలు పెద్ద ఎత్తున ఖర్చు చేసినందునే అభివృద్ది సాద్యం అయిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 

 

కేంద్ర అర్ధిక నిబంధనల సరళీకరణతోపాటు పలు విధానాల రూపకల్పనలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ముఖ్యంగా సేవారంగం, టూరిజం, హెల్త్ కేర్, విద్యారంగం మొదలైన రంగాల్లో కేంద్రం పూర్తి స్వేచ్చ రాష్ట్రాల‌కు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ఉమ్మడి జాబితాలో ఉన్న అనేక అంశాలను రాష్ర్టాలకి బదిలీ చేయాలన్నారు. సులభమైన నిబంధనలున్నప్పుడే ఇతర దేశాలతో తయారీ రంగంలో భారతదేశం పోటీ పడగలుగుతుందని, మన కన్నా చిన్న దేశాలైన బంగ్లాదేశ్, వియాత్నాం లాంటి దేశాలు ఎలక్ర్టానిక్స్, టెక్స్ టైల్, అప్పారెల్ రంగాల్లో ముందు వరుసలో ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కేంద్రం ప్రారంభించిన మేకిన్ ఇండియా స్లోగన్ కాస్తా అసెంబ్లింగ్ ఇన్ ఇండియాగా మారిందని, తయరీ రంగంలో పూర్తి స్ధాయి తయారీ దిశగా తీసుకుపోయేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.


 
దేశ అర్ధిక వ్యవస్ధ భారీ వృద్ది చెందాలంటే భారీ ప్రాజెక్టుల అలోచన చేయాలని కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ భారీగా సాగునీటి ప్రాజెక్టులతోపాటు, ప్రపంచంలోనే పలు అతిపెద్ద ఫార్మా క్లస్టర్లలో ఒకటైన హైదారాబాద్ ఫార్మాసిటీ, దేశంలోనే అతిపెద్దదైన వరంగల్ టెక్స్ టైల్ పార్కుల ఎర్పాటుతో ప్రపంచంతో పోటీ పడేందుకు సిద్దం అవుతున్నామని, వీటికున్న జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా కేంద్ర సహాకారం కోరినా ఇప్పటి దాకా ఏమాత్రం మద్దతు ఇవ్వలేదన్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను పట్టించుకోలేనప్పుడు భారీ అర్ధిక వ్యవస్ధ ఏర్పాటు లక్ష్యం ఏలా నెరవేరుతుందని ప్రశ్నించారు. 


గతంలో ప్రధాన మంత్రితో జరిగిన సమావేశంలో దేశాభివృద్దికి త్రి ఐ(3I) మంత్రా పాటించాలని సూచించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఇన్నోవేషన్, ఇన్ ప్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ ద్వారా నయాభారత్ నిర్మాణం సాద్యం అవుతుందని తెలిపారు. ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీపడుతూ నూతన అవిష్కరణలు చేయాలని, ఈ రంగంలో తెలంగాణ టి హబ్ వంటి భారీ ఇంక్యూబేటర్ ను నెలకోల్పిందని తెలిపారు. దేశం వేగంగా ఎదుగుతున్నా, ఇన్ ప్రాస్ట్రక్చర్  రంగం మాత్రం అనుకున్న మేర విస్తరించడం లేదన్నారు. ఈ రంగంలో 2014కి ముందు తెలంగాణలో కేవలం సూమారు 50వేల కోట్లు ఖర్చు చేస్తే తాము అధికారంలోకి వచ్చిన ఐదు సంత్సరాల్లోనే సూమారు లక్షా 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను చేపట్టి అర్ధిక ప్రగతి పాటు పడుతున్నామన్నారు. దీంతోపాటు పట్టణాలు, గ్రామాల మద్య మరింత గ్యాప్ రాకుండా సమాంతరంగా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉన్నదన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: