ప్రేమ పేరుతో నమ్మించి ఆ తర్వాత శారీరకంగా కోరిక తీర్చుకున్నాక.. వదిలేస్తున్నారు. ఇలాంటివి ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతున్నాయి . కేవలం శారీరక అవసరం కోసమే ప్రేమా దోమా అంటూ మాయ మాటలు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు  ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతుండగా...  తాజాగా ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. బాధ్యత గల పోలీసు వృత్తిలో కొనసాగుతున్న వ్యక్తి ప్రేమ పేరుతో యువతిని వంచించి తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత గా ఉండాల్సిన కానిస్టేబుల్.. నీచంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్లోని సైదాబాద్ డివిజన్ లో చోటుచేసుకుంది


 బేగంపేటకు చెందిన యువతి కి శివ కుమార్ రెడ్డితో చిన్నప్పటి నుంచీ పరిచయం ఉంది. అయితే ఉన్నత చదువులు కారణంగా ఇద్దరు  చాలాకాలం కలుసుకోలేదు మాట్లాడుకోలేదు. కొంతకాలం క్రితం ఇతర ఫేస్బుక్ ద్వారా మళ్లీ పరిచయం అయ్యారు. కాగా ప్రస్తుతం శివకుమార్రెడ్డి  కానిస్టేబుల్గా పని చేస్తుండగా ఆ యువతి ఓ కంపెనీలో జాబ్ చేస్తోంది. వీరిద్దరికీ అప్పటికే పరిచయం ఉండడంతో సెల్ ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకొని చాటింగ్ కూడా చేసుకునేవారు. ఈ క్రమంలోనే ఆ యువతిపై కామవాంఛను పెంచుకున్న కానిస్టేబుల్ శివ కుమార్ రెడ్డి ఓ రోజు... ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉండగా శివ కుమార్ రెడ్డి ఆమెను లొంగదీసుకుని అత్యాచారం చేశాడు. నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. దీంతో ఆ యువతి కూడా జరిగిన ఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. 

 

 కానీ ఈ ఏడాది జనవరి నెలలో శివ కుమార్ రెడ్డి ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో  శివ కుమార్ రెడ్డి తీరుపై అనుమానం వచ్చిన యువతి జనవరి 14న నేరుగా  కలిసి నిలదీసింది పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అంటూ ప్రశ్నించింది. అయితే అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి చేసుకోవలసి వచ్చిం దంటూ .. ఇకపై తనకు ఫోన్ చేసి విసిగించ వద్దు అంటూ శివకుమార్ ఆ యువతితో తెగేసి చెప్పాడు. ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన శివ  కుమార్ రెడ్డి ఇప్పుడు మాట మార్చడంతో బాధితురాలు షాక్కి గురైంది. ఇక గురువారం మలక్పేట్  పోలీసులకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: