చంద్రబాబు అక్రమాల పై విచారణ జరిపించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ డిమాండ్ చేశారు . ఇప్పటి వరకు బయటకు వచ్చినవి చాలా తక్కువని.. ఇంకా పెద్ద కుంభ కోణాలు చాలా ఉన్నాయని అన్నారు.  త్వరలోనే అవన్నీ కూడా బయట పడతాయని అన్నారు. ఐటీ అధికారులు నిర్వహించిన సోదాల్లో బాబు, ఆయన సన్నిహితుల అవినీతి బండారం బట్టబయలు అయ్యిందన్నారు. ఐటీ సోదాల పై స్పందించిన గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఎప్పుడూ నీతి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడేం సమాధానం చెబుతారని గిరి ప్రశ్నించారు. ఇంత జరిగినా ఆయన ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. బాబు బాగోతాలు ఒక్కొక్కటిగా బయట కొస్తున్నాయని.. కేంద్రం జోక్యం చేసుకుని చంద్రబాబు అక్రమాల పై విచారణ జరిపించాలని మద్దాలి గిరిధర్ డిమాండ్ చేశారు.

 

నీతి, నిజాయితీకి మారు పేరు అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో బాబు ఘనుడు.. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌ అజ్ఞాతం లోకి వెళ్లిపోయారు అని గుంటూరు ఎమ్మెల్యే మాద్దాలి గిరి ధర్ అన్నారు.

 

చంద్రబాబు అండ్ కోపై నిస్పక్షపాతంగా విచారణ జరిపితే వాస్తవాలు బయట పడతాయని అన్నారు గిరిధర్. ఇంత జరుగుతున్నా ఎల్లో మీడియా కనీసం స్పందించడం లేదని.. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో బాబు ఘనుడని.. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్‌ అజ్ఞాతం లోకి వెళ్లిపోయారని ఆరోపించారు మద్దాలి గిరిధర్. 

 

అసలు ఎల్లో మీడియా ఎందుకు స్పందించడం లేదని ఆయన అన్నారు. మద్దాలి గిరిధర్ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నుంచి గెలిచారు. రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి.. వైఎస్సార్‌ సీపీ కి జై కొట్టారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: