కొన్ని రోజుల క్రితం వరుడి తండ్రితో వధువు తల్లి పరారైన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. పెళ్లికొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి తమ పిల్లల పెళ్లికి కొద్దిరోజుల ముందు ఇంటి నుండి పారిపోవడంతో ఇరుకుటుంబాలు షాక్ కు గురయ్యాయి. జనవరి నెల మూడవ వారంలో ఈ జంట పారిపోగా తాజాగా వీరిద్దరూ వెనక్కు వచ్చి విడిపోయారు. ప్రేమికుల రోజుకు ముందు రోజు ఈ జంట విడిపోవడం గమనార్హం. 
 
పూర్తి వివరాలలోకి వెళితే 26 సంవత్సరాల క్రితం ఒక జంట ఒకరినొకరు అమితంగా ప్రేమించుకున్నారు. అతడు ఒక పెళ్లిలోఆమెను చూసి ప్రేమలో పడిగా ఆమె కూడా అతనితో ప్రేమలో పడింది. కానీ ఆమె ప్రేమించిన వ్యక్తి పేదవాడనే కారణంతో ఆమె తండ్రి వీరి ప్రేమకు అంగీకరించలేదు. అలా విడిపోయిన ఈ జంట చాలా సంవత్సరాల తరువాత అనుకోకుండా కలుసుకున్నారు. 
 
అలా కలుసుకున్న ఈ జంట రోజూ గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకోవటంతో పాటు తమ పిల్లలకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ  వధువు తండ్రి వధువు తల్లి ప్రేమ వ్యవహారం ఆమె భర్తకు తెలియడంతో ఆమె, అతడు కలిసి లేచిపోయారు. వధువు తల్లితో వరుడి తండ్రి లేచిపోవడంతో ఇరు కుటుంబాల పరువు పోయింది. సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వైరల్ కావడం, జనం ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుకోవడంతో పారిపోయిన మహిళ ఇంటికి తిరిగి వచ్చింది. 
 
వరుడి తండ్రి ప్రియురాలికి దూరమై తన భార్య పిల్లలకు దగ్గరయ్యాడు. వరుడి తండ్రి మాట్లాడుతూ " నా వలన ఆమె బాధపడటం నాకు ఇష్టం లేదు.. తను మంచి జీవితం గడపడడానికి నేను హామీ ఇస్తున్నాను" అని చెప్పారు. కానీ పారిపోయి తిరిగొచ్చిన మహిళ భర్త మాత్రం "ఇన్నిరోజుల పాటు తను వేరే వ్యక్తితో గడిపి ఇంటికి తిరిగొచ్చింది. నిజంగా వెనక్కు రావాలంటే రెండు మూడు రోజుల్లో రావాల్సింది.. ఆమెను నేను అంగీకరించను" అని చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: