త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు జరగబోయే ఈ బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరగబోతున్నట్లు సమాచారం. అయితే ఈ బడ్జెట్ సమావేశాలలో జగన్ చాలా తెలివిగా వ్యవహరించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి భూముల విషయంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ విధానం మొత్తం ఆధారాలతో సహా బయట పెట్టాలని జగన్ డిసైడ్ అయ్యారట. దీంతో అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికై రాజధాని అమరావతి ప్రకటించక ముందు జరిగిన భాగోతం మొత్తం బయట పెట్టడానికి వీడియో రూపంలో ఎల్ఈడి లో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో జగన్ వివరిస్తూ చూపించబోతున్నారు అని సమాచారం.

 

ఎప్పటికైనా ఆ వీడియో కి సంబంధించి వరకు జరుగుతున్నట్లు వైసీపీ పార్టీ వర్గాల్లో టాక్. చంద్రబాబు మరియు ఆయన బినామీలు ఏ విధంగా అమరావతి రైతులను మరియు ఏపీ ప్రజలను బురిడీ కొట్టించి రాజధానిని ప్రకటించడం జరిగిందో ఆ ప్రాసెస్ మొత్తాన్ని వివరించడానికి జగన్ డిసైడ్ అయ్యారట. ఇటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న జగన్...కేంద్ర హోంమంత్రి అమిత్ షా నీ కలవబోతున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ అధికారులు చంద్రబాబు దగ్గర పని చేసిన వ్యక్తిగత కార్యదర్శి దగ్గర రెండు వేల కోట్లు గుర్తించడంతో ఈ న్యూస్ రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో వైరల్ గా మారింది.

 

దీంతో ఢిల్లీలో ఉన్న జగన్ ఈ కేసు విషయంలో కూడా లుక్కు వేయాలని పార్టీ నేతలకు సూచించారట. అంతా కుదిరితే అవినీతి సొమ్ము అక్రమ లావాదేవీలు ఏవిధంగా జరిగిందో అది కూడా బయట పెట్టడానికి జగన్ రెడీ అవుతున్నట్లు...దీనికి సంబంధించిన వీడియోని కూడా క్రియేట్ చేయాలని వైసీపీ పార్టీ నేతలకు ఢిల్లీ నుండి జగన్ ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో వినబడుతున్న టాక్. దీంతో బడ్జెట్ సమావేశాల్లో బాబుకి బిగ్ షాక్ ఇవ్వడానికి జగన్ రెడీ అయినట్లు అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: