పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోసారి రెచ్చిపోయాడు. భారత్ పై తనకున్న ఆగ్రహాన్ని ప్రకటించాడు. భారత్ పై పవిత్ర యుద్ధం చేయాలని పిలుపు ఇచ్చాడు. పొరుగు దేశంపై జీహాద్ చేయాలంటూ రంకెలు వేశాడు. ఇలా ఇమ్రాన్ ఖాన్ రంకెలు వేయడం ఆయనకు కొత్తేమీ కాదు.

 

పాకిస్తాన్ తో తన క్రేజ్ తగ్గినప్పుడల్లా ఇమ్రాన్ ఖాన్ చేసే పని ఇదే. భారత్ ను ఎంతగా తిడితే అక్కడ అంతగా క్రేజ్ పెరుగుతుందని ఇమ్రాన్ ఖాన్ ఫీలవుతుంటాడు. ఒక్క ఇమ్రాన్ ఖాన్ మాత్రమే కాదు.. పాక్ నాయకులంతా అలాగే వ్యవహరిస్తారు. భారత్ ను తిట్టడం ద్వారా అక్కడ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తుంటారు.

 

ఇలా పొరుగు దేశం పై విద్వేష ప్రసంగాలు చేసే నాయకులకు భారత ప్రజలు బుద్ది చెప్పాలి. ప్రత్యేకించి భారత్ లోని మైనారిటీలు ఇలాంటి కుక్క ల్లాంటి నాయకులకు తగిన జవాబు ఇవ్వాలి. పవిత్ర యుద్ధం అంటూ మతోన్మాదాన్ని రెచ్చగొడితే రెచ్చిపోయేవాళ్లు ఎవరూ లేరని పాక్ పాలకులకు తగిన బుద్ది చెప్పాల్సి ఉంది.

 

మతం పేరు చెప్పి.. విద్వేషాలు రెచ్చగొట్టడం సాధ్యం కాదని భారత్ లోని మైనారిటీలు పాక్ పాలకులకు బుద్దొచ్చేలా చెప్పాల్సి ఉంది. జీహాద్ అంటూ రొటీన్ డైలాగులు కొడితే ఇక్కడ రెచ్చిపోయేవాళ్లూ ఎవరూ లేరన్న సందేశం పాక్ పాలకులకు చేరాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: