మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఐటీ దాడులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ కి సంబంధించిన నేతల పై ఐటీ దాడులు జరగడం రెండు వేల కోట్ల నిధుల మళ్లింపు అంశం తెరమీదకు వచ్చింది. అయితే టిడిపి అక్రమాలపై ఇప్పటివరకు ఇతర పార్టీ నేతలందరూ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సొంత పార్టీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఐటీ దాడులపై స్పందించాలి అంటూ పట్టుబట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత పై విమర్శలు చేయడంతో టిడిపి నేతలు అందరూ అవాక్కయ్యారు. 

 

 గుంటూరు జిల్లా పశ్చిమ టిడిపి ఎమ్మెల్యే మద్దాల గిరిధర్...ఆంధ్ర  రాజకీయాల్లో సంచలనం గా మారిన ఐటీ దాడులపై స్పందిస్తూ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని... డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఐటీ సోదాలు బయటకు వచ్చినది  చాలా తక్కువే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ . చంద్రబాబు ఖాతాలో పెద్ద పెద్ద కుంభకోణలే ఉన్నాయంటూ  సంచలన ఆరోపణలు చేశారు. త్వరలోనే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడం సంచలనంగా మారింది. 

 


 ఆంధ్ర రాజకీయాల్లో  ఈ ఐటీ దాడులు సంచలనం గా మారినప్పటికీ... చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ... చంద్రబాబు మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ ప్రశ్నించారు. నిజాయితీకి మారుపేరు అంటే ప్రగల్బాలు పలికే చంద్రబాబునాయుడు ఇప్పుడు ఐటీ దాడులకు  ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ . ఐటీ దాడులపై చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని చంద్రబాబు అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలంటూ ఆరోపించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడంతో వైసీపీ  పార్టీకి మరింత బలం చేకూరింది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే తీరు మాత్రం ఆంధ్ర రాజకీయాల్లో  ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: