మహిళలు చాలా సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు అందుకే కవులు కూడా ఆడవాళ్ళను ప్రకృతితో పోలుస్తారు..శరీరాకృతి లాగానే మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది..ఏదైనా ఇట్టే నమ్మే స్వభావం కలిగి ఉంటారు.. అందుకే అమ్మాయిలను అబ్బాయిలు ఈజీగా బురిడీ కొట్టిస్తారు.. అలా నమ్మి చాలా మంది మోసపోతారు కూడా..ఈ మధ్య అబ్బాయిలు మోసం చేశారని చాలా మంది ప్రాణాలను వదిలిన ఘటనలు కూడా వినపడుతున్నాయి...

 

 

అసలు విషయానికొస్తే...చిక్కమగళూరు జిల్లా యల్లందూరు ప్రభుత్వ పాఠశాలలో ధనుంజయ్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో రాణి అనే మరో ఉపాధ్యాయురాలు కూడా పని చేస్తోంది. టీచర్‌పై కన్నేసిన ధనుంజయ్ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అప్పటికే తనకు వివాహమైనా కాలేదని అబ్ధం చెప్పి ఆమెతో ప్రేమ వ్యవహారం కొనసాగించాడు. కొద్దికాలం కలసి తిరిగారు.

 

 

అయితే ఆమెకు బదిలీ కారణంగా దగ్గరలోనే ఉన్న మరో పాఠశాల మాకాం మార్చింది.. దీనితో అతనికి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది..అతని మాట మారుస్తూ రావడంతో అనుమానం వచ్చిన ఆమె తన తమ్ముడిని ఆరా తియ్యమని పంపింది.. అందులో భాగంగా నమ్మలేని నిజాలు తెలుసుకొని కంగు తింది.. అతనికి ముందే పెళ్లైంది అని తెలుసుకొని షాక్ అయ్యింది..అతడి చేతిలో మోసపోయింది అని తెలుసుకుంది .. పది మందికి తెలిస్తే పరువుపోతుందని భావించింది... చనిపోవాలని నిర్ణయించుకుంది.. 

 

 

అలా అవమాన భారంతో బతకలేక కఠిన నిర్ణయం తీసుకుంది. విషం తాగి బలవన్మరణానికి యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ప్రేమ పేరుతో యువతులను వాడుకుంటున్న ఇలాంటి కుక్కలను ఉరి తీయాలని మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. పెళ్ళై ఇలా మోసం చేసే వారికి బుద్ది వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: