ఆడవాళ్ళు ఇంట్లో రక్షణ లేదన్న విషయం ఈమధ్య వార్తల్లో వింటూ వస్తున్నాము..కన్న తండ్రి కూతురిపై అత్యాచారం చేసాడనో.. లేక డబ్బుల కోసం అమ్మడనో ఇలాంటి ఘటనలు చాలానే వచ్చాయి.. అందుకే సమాజం కూడా  అమ్మాయిలను చిన్న చూపు చూస్తుంది.. దిశ లాంటి అమ్మాయిలు కామాంధుల చేతిలో బలపోతున్నారు.. మన రాష్ట్రంలో కన్న తమిళనాడు వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. 

 

 

చెల్లెలిపై సొంత అన్న అత్యాచారం చేయడంతో మనస్థాపం చెందిన బాలిక.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలిక సూసైడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసు విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బాలికపై అన్న అత్యాచారం చేయలేదని తెలిసినట్లు సమాచారం. తన బావమరిదితో పెళ్లి చేసుకోనన్నందుకు చేయిచేసుకున్నాడని.. అందువల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

 

భద్రాద్రి కొత్త గూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది..పట్టణంలోని జ్యోతినగర్‌కి చెందిన దంపతులకు కొడుకు, కుమార్తె సంతానం. కుమారుడికి గతంలోనే వివాహం జరగడంతో సమీపంలోని పాతపాల్వంచ ప్రాంతంలో వేరుగా నివాసం ఉంటున్నాడు. బాలికకు ఇటీవలె డోర్నకల్‌కి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. బాలిక వయస్సు 18 ఏళ్లు నిండకపోవడంతో కొన్నాళ్లు ఆగి వివాహం చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

 

అయితే బావమరిదిని చెల్లికి ఇవ్వాలని అనుకున్న అన్న ఆమె వద్దనడంతో మద్యం సేవించి వచ్చి చెల్లి పై చెయ్యి చేసుకున్నాడు..సమయంలో అతని వెంట మరో స్నేహితుడు కూడా వచ్చాడు. మద్యం మత్తులో తూలుతున్న అన్న చెల్లిని కొట్టి అక్కడే పడిపోయినట్లు చెబుతున్నారు. ఆ తరువాత అన్న వెంట వచ్చి స్నేహితుడు బాలికపై అత్యాచారానికి యత్నించాడని.. అవమానంతో ఆమె పురుగుల మందు తాగి ఉంటుందని స్థానికులు చర్చించుకుంటున్నట్లు సమాచారం... ఆమె పరిస్థితి విషమంగా ఉంది..అని వైద్యులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: