అక్కా, చెల్లి ఇద్దరిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది..తల్లిదండ్రులు విడిపోవడంతో అవ్వ దగ్గర నివాసం ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు (మైనర్లు) మీద సొంత బంధువులు 16 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. సుమారు ఏడాదిన్నపాటు అక్కా, చెల్లి మీద లైంగిక దాడి చెయ్యడంతో ఇద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురైనారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు అమ్మాయిల్లో 7 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా మృతి చెందింది. 

 

 

అయితే, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న అక్కా, చెల్లి మీద కామంతో లైంగిక దాడి చేసిన మనుషుల రూపంలో ఉన్న జంతువులు ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చి జల్సాగా తిరుగుతున్నారు. తల్లి దండ్రులు కొన్ని కారణాల వల్ల విడిపోవడం ఆ ఇద్దరు మరొకరిని వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరు ఆడపిల్లలను అమ్మమ్మ దగ్గర ఉంచారు..అక్కడే ఉంటూ చదువు కునేవారు..అలా రోజులు గడుస్తూ వచ్చాయి.. 

 

 

స్కూల్ లుకు వెళుతున్నా వారిద్దరిలో ఒకరికి తీవ్ర కడుపునొప్పి రావడంతో స్కూల్ టీచర్లు బాలికను ఆసుపత్రికి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. పుదుచ్చేరిలోని జష్మర్ ఆసుపత్రి వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేశారు. బాలిక మీద లైంగిక దాడి జరగడం వలనే కడుపునొప్పి వచ్చిందని వైద్యులు చెప్పారు.ఏళ్ల బాలిక మీద లైంగిక దాడి జరిగిందని తెలుసుకున్న ఆమె తల్లి, అవ్వ షాక్ కు గురైనారు. వెంటనే బాలికను ప్రశ్నించగా కామాంధులైన వారి బంధువుల విషయం బయటకు వచ్చింది. 

 

వెంటనే అనుమానం వచ్చి బాలిక అక్క ( 9 ఏళ్లు)కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె పై కూడా సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పారు.  ఎవరేమి చేశారని అడిగితే బంధువుల పనేనని తెలుసుకొని షాక్ కు గురయ్యారు..బాలికల తల్లి, అవ్వ ఫిర్యాదు చెయ్యడంతో విల్లుపురం జిల్లా బ్రహ్మదేశం పోలీసులు కేసు నమోదు చేసి తెన్ ర్కుండ్రం గ్రామానికి చెందిన బాలికల బంధువులు 16 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. 7 ఏళ్ల బాలిక నొప్పి ఎక్కువ కావడంతో మరణించింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: