ఈ రోజుల్లో ప్రేమలు ఎలా ఉన్నాయంటే... కన్న ప్రేమను కూడా మరిచి పోతున్నారు. పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను హతమార్చడానికి కూడా వెనుకాడడం లేదు. ప్రియుడి  మత్తులో మునిగి పోయి కన్న తల్లిని హత్య చేసిన ఘటనలు ఈ రోజుల్లో రోజురోజుకు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలతో లోకం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ఘటనలు ఎన్నో తెరమీదికి రాగా తాజాగా ఇలాంటి దారుణమైన ఘటన మరొకటి జరిగింది. తన ప్రేమకు అడ్డు వస్తుందని ఏకంగా కన్నతల్లిని కాటికి పంపింది ఇక్కడ ఓ కసాయి కూతురు. అతి దారుణంగా గొంతుకోసి హత్య చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 

 

 ఘజియాబాద్ కు చెందిన శశి  మాల స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్  కానిస్టేబుల్గా పని చేస్తోంది... భర్త కూతురుతో కలిసి బ్రిడ్జ్ విహార్ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే పదోతరగతి చదువుతున్న ఆ బాలిక ఇటీవలే జితేంద్ర అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇక ప్రేమలో మునిగితేలే సినిమాలు షికార్లు ఎక్కువవడంతో చదువు కాస్తా అటకెక్కింది. ఇక కూతురి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తల్లి శశి  కూతురుని మందలించింది. ప్రేమా దోమా అంటూ జీవితాన్ని పాడు చేసుకోకుండా బుద్ధిగా చదువుకోవాలంటే సూచించింది. అయితే తల్లి మాటలు ఆ బాలికకు తల్లిపై ద్వేషాన్ని పెంచాయి. తల్లి కంటే ప్రియుడే  ముఖ్యమని భావించింది  ఆ బాలిక. 

 

 దీంతో జన్మనిచ్చిన కన్నతల్లి అడ్డు తొలగించాలని నిర్ణయించింది. కాగా  తండ్రి పని నిమిత్తం బీహార్ కి వెళ్ళగా... అదే అదునుగా భావించిన ఆ బాలిక శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రియుడిని ఇంటికి రప్పించి ఇద్దరు కలిసి తల్లి శశి గొంతు కోసి చంపేశాడు. మరుసటి రోజు పని ముగించుకుని ఇంటికి వచ్చిన భర్తకు భార్య విగతజీవిగా బెడ్రూంలో కనిపించడానికి గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే శశి చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యారు భర్త. కాగా జరిగిన విషయం పై కూతురును  నిలదీసి అడుగగా పొంతన  లేని సమాధానాలు చెప్పింది  దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో. తమదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో పోలీసులు బాలిక తో పాటు ఆ బాలిక ప్రియుడు జితేంద్ర ను కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: