కన్న బిడ్డకు రక్షణగా నిలవాల్సిన తండ్రి సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు ఓ నీచుడు. కడుపున మోయకపోయినా కడుపులో పెట్టుకుని దాచుకునే వాడే తండ్రి. నాన్నప్రేమ ఆకాశమంత. అది అమృతంతో సమానం. క్షణికావేశంలో అది విషమైతే.. అనాగరికపు కట్టుబాట్లలో కొట్టుకుని కన్నప్రేమ కకావికలమైతే. ఫలితం విషాదం. ఇక తాజాగా నాన్న అనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు ఒకడు. కూతురికి వైద్యం చేయిస్తే డబ్బులు అయిపోతాయని.. పెద్దయ్యాక పెళ్లి చేస్తే భారీ ఖర్చు అయిపోతుందని భావించి కూతురినే కాటికి పంపించారు. అంత్యక్రియలకు తీసుకెళ్లే సమయంలో అసలు విషయం బయటపడడంతో అందరూ విస్మయానికి గురయ్యారు.
ఈ దారుణ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా జాంబాపూర్ తండాకు చెందిన రవినాయక్ బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరుకు వచ్చి స్థిరపడ్డాడు. మేస్త్రీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక కూతురు రేణుక నవాబుపేటలోని కేజీబీవీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అయితే బాలికకు జ్వరం రావడంతో ఆత్మకూరులోని ఇంటికి తీసుకొచ్చాడు. విషయం తెలిసిన బంధువులు పట్టణంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ, తండ్రి బుర్రలో నీచపు ఆలోచనలు మొదలయ్యాయి. గతంలో ఒకసారి బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్తే.. 20 వేలు అయ్యాయని.. ఇక ఆ సారి ఎంత అవుతాయో నీచపు ఆలోచన చేశాడు.
అలాగే కూతురు పెద్దదైన పెళ్లి ఖర్చులు మరింత అవుతాయని భావింత ఆ తండ్రి కిరాతకంగా పాప గొంతునులిమి చంపేశాడు. ఏమీ ఎరగనట్టు భార్యను పిలిచి వెక్కిళ్లు వచ్చి ప్రాణం పోయిందని చెప్పాడు. అది నమ్మిన తల్లి శోకసంద్రలో మునిగిపోయింది. అయితే ఖననానికి ఏర్పాట్లు జరుగుతుండగా బాలిక గొంతు కమిలిపోయి ఉండడాన్ని గమనించిన బంధువులు, స్థానికులు అనుమానం రావడంతో అధికారులకు సమాచారం అందించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు రేణుక మృతదేహాన్ని పోస్టుమార్టం అసలు విషయం బయటపడింది. ఇక రేణుక తండ్రి కూడా పోలీసుల విచారణ విషయం బయటపెట్టారు. ఇక నిందితుడిని కోర్టుకు హాజరుపరచడంతో రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది.