ఈ మధ్య కాలంలో సమాజంలో మానవత్వం మంటగలిసి పోతుంది. మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు సాటి మనుషులు. చిన్న చిన్న వివాదానికే ప్రాణాలను సైతం హరించేస్తున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది కనీసం మానవత్వం మరిచిన తమ్ముడు అన్న కుటుంబాన్ని అతి దారుణంగా హతమార్చాడు. అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం కాస్త కుటుంబాన్ని బలి తీసుకుంది. మానవత్వాన్ని మరిచిన తమ్ముడు సొంత అన్ననే  అతి దారుణంగా నరికి చంపాడు.అన్నతో పాటు కుటుంబాన్ని మొత్తం... దారుణంగా హత్య చేశాడు. కాగా మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం  తీవ్ర విషాదకరం.

 

 

 వివరాల్లోకి వెళితే... ఒడిషాలోని సుందర్ ఘడ్ జిల్లా  దేవులహుడిలో జరిగింది ఈ దారుణ ఘటన. గ్రామానికి చెందిన కందే ముండా,  కాళీ ముండలు అన్నదమ్ములు. అయితే ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల విషయంలో గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇక ఆస్తి తగాదాల విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్న తమ్ముడు కాళీ... అన్న పై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 11 గంటల సమయంలో అన్న కందే ముండా ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న అన్నయ్య పై గొడ్డలితో అతి దారుణంగా దాడికి దిగాడు.

 

 

 ఇక తమ్ముడు దాడితో తీవ్రంగా గాయపడిన అన్న కందే ముండా పెద్దగా అరుస్తూ భయంతో పరుగులు తీశాడు. ఇక భర్త అరుపులతో మేల్కొన్న భార్య సుములి,  ఇద్దరు పిల్లలు సమీలీ (7)  మర(5) కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అతడి వెనకే పరుగులు పెట్టారు. అయినప్పటికీ వదలని తమ్ముడు కాళీ వారిని వెంబడించారు. ఈ క్రమంలోనే ఒకరి తర్వాత ఒకరిని గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: