కరీంనగర్‌ మానేరు డ్యాం వద్ద బ్రిడ్జిపై నుంచి కారు  కిందపడి పోయిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. కాకతీయ కెనాల్‌లో ఓ కారును గుర్తించారు స్థానికులు. నగర శివారులోని అలుగునూరు ప్రాంతంలో ఇది బయటపడింది.  నిన్నటి వరకూ కెనాల్ లో నిండా నీరుండగా, అధికారులు నీటి విడుదలను నిలిపివేయగానే, కారు బయటకు కనిపించింది.  యాదాలపల్లి సమీపంలోని అలుగునూరు వద్ద కెనాల్ లో కారును గమనించిన స్థానికులు, విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.  15 రోజుల క్రితమే కాలువలో కారు పడిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.  మరణించిన వారిని కరీంనగర్‌లోని బ్యాంకు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు.

 

ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  ఈ కారు దాదాపు 2 వారాల క్రితమే నీటిలో పడి వుండవచ్చని నిర్ధారించిన పోలీసులు, కారులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను గుర్తించారు. కారు నీటిలో పడి 15 రోజులు గడవడంతోనే మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయని తెలిపారు.  ఈ రెండు మృతదేహాలూ పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ, ఆమె భర్త లక్ష్మీపూర్ కు చెందిన సత్యనారాయణరెడ్డిగా గుర్తించారు. వీరిద్దరూ రెండు వారాలకు పూర్వం తమ కుమార్తె వినయ శ్రీతో కలసి బయలుదేరారని, అప్పటి నుంచి అదృశ్యమయ్యారని పోలీసు కేసు కూడా నమోదైంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిగా గుర్తించారు.   

 

మృతి చెందిన వారు  రెండు వారాలకు పూర్వం తమ కుమార్తె వినయ శ్రీతో కలసి బయలుదేరారని, అప్పటి నుంచి అదృశ్యమయ్యారని పోలీసు కేసు కూడా నమోదైంది. అదే రోజున వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇక కారులో వినయశ్రీ మృతదేహం కనిపించకపోవడంతో ఆమె కోసం గాలింపు తీవ్రతరం చేశారు. ఇదిలా ఉంటే చెల్లి, బావ మరణంతో మనోహర్ రెడ్డిని పలువురు రాజకీయ, పుర ప్రముఖులు ఓదార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: