దేశ ప్రధాని నరేంద్ర మోదీ పై ప్రతి విషయంలోనూ మాటల తూటాలతో విరుచుకు పడే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్ర పదజాలం తో విరుచుకుపడ్డాడు. మోదీని విమర్శించటం పై అధికార పార్టీ గుర్రుగా ఉండటం తో వాళ్ళను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు ఒవైసీ. అంతే కాదు తాను మోదీకి వ్యతిరేకంగానే మాట్లాడతానని చెప్పటమే కాదు, కావాలంటే తనని చంపుకొండి అని సవాల్ విసిరాడు. గత ఎన్నికల సమయం లో ఒవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.

 

వివరాల్లోకి వెళ్తే... ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మళ్లీ తీవ్ర  వ్యాఖ్యలు చేశాడు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు తయారు చేస్తామని తేల్చి చెప్పాడు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపినా సరే వెళ్లేందుకు మేం సిద్ధం అన్నాడు. తాను 25 ఏళ్లుగా భద్రత లేకుండానే తిరుగుతున్నానని, చంపాలనుకుంటే చంపేయొచ్చని వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని, ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను తన చెప్పుతో తొక్కేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని గుల్బర్గ లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అసదుద్దీన్‌ కు ఇది కొత్తేమీ కాదు! తరచూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతుంటారు. అంతే కాదు, ఇటీవల ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీ, సీఏఏ విషయంలో బీజేపీపై విమర్శల ఘాటు మరింత పెంచారు. ఈ క్రమంలోనే ఒవైసీ తాజాగా కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యల పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎలా స్పందిస్తయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: