గత కొంత కాలంగా ప్రపంచ దేశాలను ఒక్క కుదుపు కుదిపేస్తుంది కరోనా వైరస్.   ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చైనాల్ 1800 ల మంది మృత్యువాత పడ్డట్లు సమాచారం. కరోనా వైరస్ ధాటికి అల్లాడుతున్న చైనాలో పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. వైరస్ దాడి మొదలైన వూహాన్ పట్టణం ఉన్న ప్రావిన్స్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా నిర్బంధంలోనే ఉన్నాయి.  శనివారం ఒక్కరోజే 105 మంది మృతిచెందారని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. ఇందులో వంద మంది కేవలం హుబే ప్రావిన్స్ కు చెందినవారు ఉన్నట్టు తెలిపింది. ఈ హుబే ప్రావిన్స్ లోని వూహాన్ నగరంలోనే కరోనా వైరస్ తొలిసారిగా ప్రబలింది.

 

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జపాన్ సముద్ర జలాల్లో తీరానికి దూరంగా నిలిపిన ‘డైమండ్ ప్రిన్సెస్’ క్రూయిజ్ షిప్ లో మరో 99 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో షిప్ లో వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 454 కు చేరింది. ఈ మద్య  హుబే ప్రావిన్స్ లోనే చాలా వరకు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ రోజూ స్వల్ప సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. . ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత ఎక్కువగా కరోనా బాధితులు ఉన్నది ఈ క్రూయిజ్ షిప్ లోనే కావడం గమనార్హం.

 

కరోనా ఎఫెక్ట్ లో ప్రపంచంలో వ్యాపార రంగంలపై కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది.  అంతే కాదు పలు వ్యాపార సంస్థలు చైనాకు దూరంగా ఉండటం మొదలు పెట్టాయి.  తాజాగా జపాన్ లో 65 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా గుర్తించారు. దానికితోడు జపాన్ తీరంలో ఉన్న షిప్ లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నారు.  ఈ నేపథ్యంలో జపాన్ చక్రవర్తి నరుహితో 23వ తేదీన జరగాల్సిన తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: